కొండగట్టుకు ఎన్నారై రూ. 5.80లక్షల విరాళం


మల్యాల(కరీంనగర్ జిల్లా): కరీంనగర్ జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం అభివృద్ధికి జగిత్యాలకు చెందిన ధర్మపురి నీతూ వెంకటరమణ అనే ఎన్నారై రూ.5.80 లక్షల విరాళాన్ని అందజేశారు. అమెరికాలో స్థిరపడిన ఆయన మంగళవారం కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భార్య నీతూ, కుమార్తె త్రిషలతో కలిసి విరాళాన్ని ఆలయ ఈవో నర్సింహులుకు అందజేశారు. భోగశాల నిర్మాణానికి రూ. 5 లక్షలు, నిత్యాన్నదానం కోసం రూ. 30 వేలు, నిత్యహోమం కోసం రూ. 50 వేలు వెచ్చించాలని కోరారు. ఆలయ అర్చకులు వెంకటరమణకు ఆశీర్వచనాలు, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి సత్కరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top