పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా


ఇద్దరు మృతి,మరో ఇద్దరి పరిస్థితి విషమం

ఇంకో ఇద్దరి మహిళల కాళ్లు తొలగింపు


 

 వర్ధన్నపేట టౌన్ : పెళ్లి బృందాన్ని తీసుకుని వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం వర్ధన్నపేట శివారు తిర్మలాయపెల్లి రోడ్డు వద్ద జరిగిన ప్రమాద వివరాలు ఇలా ఉన్నారుు. మండలంలోని ఇల్లంద గ్రామానికి చెందిన సుంకరి వీరస్వామి-ప్రమీల దంపతుల కూతురు రమ వివాహం రాయపర్తి మండలం కాట్రపెల్లికి చెందిన రాజుతో గురువారం ఉదయం ఇల్లందలో జరి గింది. శుక్రవారం వరుడి స్వగ్రామం కాట్రపెల్లి కి పెళ్లి కూతురు బంధువులు విందు కోసం ట్రాక్టర్‌లో బయలుదేరారు.



వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారి నుంచి తిర్మలాయపెల్లి క్రాస్ రోడ్డు దాటి కొద్ది దూరం పోయాక ట్రాక్టర్ అదు పు తప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న స్టేషన్‌ఘన్‌పూర్ మండలం చాగల్లుకు చెం దిన ఎద్దు వెంకటేశ్వర్లు(45)(వధువు మేనమా మ) అక్కడికక్కడే మృతి చెందాడు, తీవ్రంగా గాయపడిన వర్ధన్నపేట మండల కేంద్రానికి చెందిన భూమ రవీందర్, స్వరూప దంపతుల కుమారుడు జగదీష్(7) వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.



మిగతా క్షతగాత్రులను 108 వాహనాల్లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వారిలో సుంకరి యాకమ్మ, జెట్టబోయిన సుగుణమ్మ కాళ్లు పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో వైద్యులు తొలగించారు. చికిత్స పొందుతున్న రేణుక, సౌమ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తీవ్ర గాయాలైన వారిలో ఎడ్ల రమేష్, ఎద్దు సాయికృష్ణ, యుద్దం జయమ్మ, ఎద్దు రజిత, నారబోయిన సుజాత, శాగ యాదమ్మ, ఇట్టె నాగలక్ష్మి, యాకర ఎలేంద్ర, యాకర ఉపేం ద్ర, గజ్జెల స్వరూపతో పాటు మరికొందరు ఉన్నారు. వర్ధన్నపేట పోలీసులు బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అతి వేగమే కారణంగా స్థానికులు చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top