వివాహేతర సంబంధం నెపంతో వ్యక్తి హత్య!


నల్గొండ(కోదాడ): కోదాడ మండలం అమీనాబాద్ శివారులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మర్మాంగాల మీద బలంగా కొట్టడం వల్ల చనిపోయి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top