తెలంగాణ సమస్యలపై 5 కమిటీల ఏర్పాటు
హైదరాబాద్: హైదరాబాద్ లో నిర్వహించిన తెలంగాణ జేఏసీ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో 5 కమిటీలు ఏర్పాటు చేశారు. ఉద్యోగులు, రైతులు, విద్యారంగం, తాగునీరు, రాష్ట్ర హైకోర్టు వంటి వివిధ విభాగాల్లోని సమస్యలను ఈ కమిటీలు అధ్యయనం చేస్తాయి.
ఉద్యోగుల సమస్యలపై టీజేఏసీ నాయకుడు దేవీప్రసాద్, దళితుల సంక్షేమంపై మల్లేపల్లి లక్ష్మయ్య నేతృత్వంలో ఈ కమిటీలు పనిచేస్తాయి. ఫిబ్రవరి 8వ తేదీ లోగా కమిటీలు నివేదిక సమర్పించాలని జేఏసీ తీర్మానించింది. అంతేకాకుండా రాష్ట్ర విభజన చట్టం అమలుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.