చెన్నై : పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్లాలని టెన్నిస్ స్టార్ సానియా మిర్జా పిలుపునిచ్చారు. శుక్రవారం ఈ స్టార్ కోయంబత్తూరులో ప్రత్యక్షమయ్యారు. వర్ణం ఫౌండేషన్ నేతృత్వంలో మై ఇండియా, వంద శాతం ఓటింగ్ నినాదంతో మారథాన్ను కోయంబత్తూరులో నిర్వహించారు. కోయంబత్తూరు కొడిసియా మైదానం నుంచి సాగిన ఈ మారథాన్కు వేలాది మంది తరలి వచ్చారు.
విజేతలకు బహుమతులు ప్రదానోత్సవం సమయంలో హఠాత్తుగా అక్కడ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ప్రత్యక్షం కావడంతో అక్కడి జన సందోహం ఆమెను చూడడానికి ఎగబడ్డారు. విజేతలకు బహుమతులు అందజేసినానంతరం మహిళల్ని ఉద్దేశించి సానియా ప్రసంగించారు. మహిళలకు వ్యాయామం తప్పని సరిగా సూచించారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి మహిళ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు దూసుకెళ్లాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆస్ట్రేలియా, యూఎస్, వింబుల్డన్ విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. డబుల్స్ ఆడేటప్పుడు సహ క్రీడాకారిణిని స్నేహితురాలిగా భావించి, సంపూర్ణ సహకారం అందించిన పక్షంలో విజయం వరించడం ఖాయం అని వ్యాఖ్యానించారు.
సంవత్సరంలో ముప్పై వారాలు టెన్నిస్ ఆడుతున్నామని పేర్కొంటూ, యూఎస్ ఓపెన్కు సిద్ధమవుతున్నట్టు చెప్పారు. క్రికెట్కు ఇస్తున్నట్టుగా ఇతర క్రీడలకు ప్రాధాన్యత పెరుగుతున్నదని వివరిస్తూ, దేశానికి చెందిన క్రీడాకారులతో డబుల్స్ ఆడడం అన్నది కాలం నిర్ణయిస్తుందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ శాతం మహిళలు క్రీడా రంగంలో రాణించాలని, ఆ దిశగా తన పయనం సాగుతుండడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు.
అన్ని రంగాల్లో దూసుకెళ్లాలి
Published Sat, Mar 5 2016 8:46 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement