జాక్‌పాట్ కొట్టిన కీర్తీసురేష్

జాక్‌పాట్ కొట్టిన కీర్తీసురేష్


వర్ధమాన నటి కీర్తీసురేష్ ఇక స్టార్ హీరోయిన్ల పట్టికలో స్థానం సంపాదించుకున్నట్లే.అంత జాక్‌పాట్‌ను కొట్టేసింది ఈ బ్యూటీ. ఇళయదళపతి విజయ్‌తో రొమాన్స్ చేసే అవకాశం ఈ అమ్మడిని వరించిందన్నది తాజా సమాచారం. కీర్తీసురేష్‌కు కోలీవుడ్‌లో తొలి చిత్రం ఇదు ఎన్న మాయం ఆమె కెరీర్‌పై పెద్దగా ప్రభావం చూపలేదుగానీ రెండో చిత్రం రజనీమురుగన్ అనూహ్య ప్రాచుర్యాన్ని సంపాదించిపెట్టింది.

 

 అది ఏకంగా ఇళయదళపతి విజయ్ సరసన నటించే స్థాయికి చేర్చేసింది. విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత విజయా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనున్న భారీ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు.ఇది ఆయనకు 60వ చిత్రం అన్నది గమన్హారం. ఇంతకు ముందు విజయ్ హీరోగా అళగీయ తమిళ్‌మగన్ చిత్రానికి దర్శకత్వం వహించిన భరతన్ ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించనున్నారు. ఇందులో కథానాయకి పాత్ర కోసం నయనతార, సమంత, కాజల్‌అగర్వాల్ పేర్లు ఇప్పటి వరకూ పరిశీలనలో ఉన్నాయి.

 

  తాజా సమాచారం వారెవరు కాదు యువ నటి కీర్తీసురేష్ విజయ్‌కి హీరోయిన్‌గా ఎంపికైంది.ఇప్పటికే  పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం ఫ్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిసింది.రజనీమురుగన్ చిత్రం తరువాత ప్రభు సాలమన్ దర్శకత్వంలో ధనుష్ సరసన నటిస్తున్న కీర్తీసురేష్, బాబీసింహాకు జంటగా పాంబుసండైతో పాటు మరోసారి శివకార్తికేయన్‌తో జత కట్టి నటిస్తున్నారన్నది గమనార్హం.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top