150 ఏళ్లనాటి నిధి దొరికింది

150 ఏళ్లనాటి నిధి దొరికింది - Sakshi


సేలం: ఇంటి నిర్మాణానికి గోతులు తవ్వుతుండగా నిధి బయట పడింది. ఈ సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు. సేలం జిల్లా ఆత్తూరు సమీపంలోని నర్సింగాపురంలో చిన్నకన్ను, సుమతి దంపతులు కొత్తగా ఇళ్లు నిర్మించే పనిలో పడ్డారు. అందుకు గాను గోతుల తవ్వే క్రమంలో నిధి బయట పడింది. అయితే, ఈ నిధి గురించి ఆ దంపతులకు తెలియదు. దీనిని తీసుకుని  మేస్త్రీ చిన్న తంబి ఉడాయించాడు. అక్కడ నిధి లభించిన సమాచారంతో గురువారం తహసీల్దార్ తెన్ మొళి, ఇతర అధికారుల బృందం రంగంలోకి దిగింది.



ఆ దంపతుల వద్ద విచారణ జరిపారు. వారు ఇచ్చిన సమాచారంతో చిన్న తంబి వద్ద ఉన్న నిధిని స్వాధీనం చేసుకున్నారు. ఈ నిధి 150 ఏళ్ల నాటిది. ఇందులో 2.13 లక్షలు విలువగల బంగార ఆభరణాలు బయట పడ్డాయి.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top