చాంపియన్స్ లీగ్ లో ఫైనల్ కు చేరిన కోల్ కతా!
హైదరాబాద్: ఛాంపియన్స్ లీగ్ టీ20 టోర్నిలో కోల్ కతా నైట్ రైడర్స్ ఫైనల్ కు చేరింది. హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం సాయంత్రం జరిగిన మ్యాచ్ లో హోబర్ట్ హరికేన్స్ జట్టుపై కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన హోబర్ట్ హరికేన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. హరికేన్స్ జట్టులో షోయబ్ మాలిక్ అత్యధికంగా 66 పరుగులు, డంక్ 39, బ్రిట్ 13, గుల్బీస్ 15 పరుగులు చేశారు.
ఆతర్వాత 141 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన కోల్ కతా నైట్ రైడర్స్ 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రాబిన్ ఉతప్ప 17, కల్లీస్ 54, మనీష్ పాండే 40, యూసఫ్ పఠాన్ 14 పరుగులు చేశారు.
సంబంధిత వార్తలు