మరింత బాగా ఆడాల్సింది: హరికృష్ణ


న్యూఢిల్లీ: మాస్కో గ్రాండ్‌ప్రి ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌లో తాను మరింత బాగా ఆడాల్సిందని భారత గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ అభిప్రాయపడ్డాడు. 18 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య స్విస్‌ లీగ్‌ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో హరికృష్ణ 4.5 పాయింట్లతో సంయుక్తంగా పదో స్థానంలో నిలిచాడు.


 


‘ఈ టోర్నీ చాలా కఠినంగా సాగింది. నేను మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సింది. బోరిస్‌ గెల్ఫాండ్‌ చేతిలో ఓడిపోకపోతే బాగుండేది. అయితే ఈ టోర్నీ నాకొక అనుభవం లాంటిది. రాబోయే రెండు గ్రాండ్‌ప్రి టోర్నీలలో బాగా ఆడతాననే నమ్మకం ఉంది’ అని హైదరాబాద్‌కు చెందిన హరికృష్ణ తెలిపాడు. ఈ టోర్నీ ద్వారా హరికృష్ణ ఖాతాలో 30 గ్రాండ్‌ప్రి పాయింట్లతోపాటు 5 వేల యూరోలు ప్రైజ్‌మనీగా లభించాయి. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top