ఆస్ట్రేలియా కబడ్డీ కోచ్‌గా శ్రీనివాస్ రెడ్డి

ఆస్ట్రేలియా కబడ్డీ కోచ్‌గా శ్రీనివాస్ రెడ్డి


సంగారెడ్డి: ఆస్టేల్రియా కబడ్డీ జట్టుకు తెలుగు వ్యక్తి కోచ్‌గా వ్యవహరించబోతున్నారు. మెదక్ జిల్లా ఉత్తర్‌పల్లికి చెందిన లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఈ అరుదైన ఘనతను దక్కించుకున్నారు. అక్టోబర్‌లో అహ్మదాబాద్‌లో జరిగే కబడ్డీ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు పొల్గొంటుంది.



ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్‌‌స జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించిన శ్రీనివాస్ రెడ్డి గతంలో దక్షిణ కొరియా జట్టుకు కూడా అసిస్టెంట్ కోచ్‌గా పని చేశారు. ‘ఈ అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. మరో రెండు రోజుల్లో ఆస్ట్రేలియా వెళుతున్నాను. ఆ దేశంలో కబడ్డీకి ఆదరణ పెంచేందుకు కృషి చేస్తాను’ అని శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top