ఆ ఏడుపు ఎందుకో..?

ఆ ఏడుపు ఎందుకో..?


 వెండితెరపై జరుగుతున్నది నిజం కాదు.. కథ అని తెలిసినా బాగా లీనమైపోయి చూస్తుంటాం. తెరపై తారలు ఏడిస్తే.. ఒక్కొసారి మనం కూడా ఏడ్చేస్తాం. ఇటీవల నయనతార కూడా అలా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ విషయంలోకి వస్తే... నయనతారకు మంచి మిత్రుడైన ఆర్య తమ్ముడు సత్య హీరోగా రూపొందిన ‘అమరకావ్యం’ చిత్రం త్వరలో విడుదల కానుంది.

 

 ఈ చిత్రాన్ని అత్యంత సన్నిహితులకు చూపించారు ఆర్య. ఈ చిత్రం చూసిన తర్వాత నయనతార అరగంటసేపు ఆపకుండా కన్నీళ్లు పెట్టుకున్నారని చెన్నయ్ టాక్. ఈ ప్రేమకథా చిత్రం ఆమెను అంతగా కదిలించింది. ఈ చిత్రం తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసిందని, అందుకే నయనతార అంతగా కదిలిపోయిందన్నది పలువురి అభిప్రాయం. ఈ సినిమా చూసిన ఐదు రోజుల తర్వాత చిత్రదర్శకుడు జీవా శంకర్‌కి ఫోన్ చేసి, చాలా బాగుందని నయనతార అభినందించారట.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top