ఒబామాకు 58%.. ట్రంప్‌కు 40%

ఒబామాకు 58%.. ట్రంప్‌కు 40% - Sakshi


అమెరికా నాయకత్వంపై పలు ప్రపం చ దేశాల ప్రజల విశ్వాసం గణనీయంగా తగ్గిపోయింది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పోకడలే ఇందుకు కారణమని ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ చేసిన సర్వేలో వెల్లడైంది. భారత్‌ సహా మొత్తం 37 దేశాల్లో ఈ సర్వే జరిగింది. భారత్‌ విషయానికి వస్తే అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాతో పోలిస్తే ట్రంప్‌కు 18% మంది ప్రజల మద్దతు తగ్గింది. గతంలో ఇదే ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ చేసిన సర్వేలో 58% మంది భారతీయులు ఒబామాపై విశ్వాసం వ్యక్తం చేయగా ప్రస్తుతం 40% మంది ట్రంప్‌పై తమకు నమ్మకం ఉందన్నారు.


18% తగ్గినా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ట్రంప్‌కు భారత ప్రజల నుంచి మద్దతు లభించడం గమనార్హం. 37 దేశాల్లోనూ కలిపి చూస్తే కేవలం 22% మందే ట్రంప్‌ సమర్థుడనీ, ప్రపంచానికి మంచి చేస్తాడని విశ్వసిస్తున్నారు. అదే ఒబామాపై 64%మంది ప్రజలకు నమ్మకం ఉన్నట్లు గత సర్వేలో తేలింది. రష్యా, ఇజ్రాయెల్‌ దేశాల ప్రజలు మాత్ర మే ట్రంప్‌ను నమ్ముతున్నారు. మిగతా అన్ని దేశాల ప్రజలూ ట్రంప్‌ను దురహం కారిగా, ప్రమాదకారిగా, అసహనపరుడిగా, అధ్యక్ష పదవికి అర్హత లేనివాడిగా భావిస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top