‘మహా ఫలితాలపై బీజేపీ విజయోత్సవం’


హైదరాబాద్‌: మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించటంతో ఆ పార్టీ శ్రేణులు ఉత్సవాలు జరుపుకోనున్నారు. ఈ నెల 25 వ తేదీ( శనివారం) నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ తలపెట్టినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు చింతల రామచంద్రారెడ్డి, కిషన్‌రెడ్డి, ఎన్‌వీవీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, రాజాసింగ్‌ తదితరులు పాల్గొంటారు. 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top