సింగరేణి రిటైర్డ్ కార్మికులకు కొత్త స్కీమ్ | Sakshi
Sakshi News home page

సింగరేణి రిటైర్డ్ కార్మికులకు కొత్త స్కీమ్

Published Sat, Aug 27 2016 1:58 AM

new medical scheme for singareni retired workers

సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో పదవీ విరమణ చేసిన కార్మికులతోపాటు వాళ్ల జీవిత భాగస్వామికి రూ.5 లక్షల విలువైన వైద్య సేవలందించే కాంట్రిబ్యూటరీ పోస్టు రిటైర్మెంట్ మెడికల్ స్కీమ్‌ను సింగరేణి యాజమాన్యం ఆమోదించింది. శుక్రవారం సింగరేణి భవన్‌లో సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ అధ్యక్షతన జరిగిన బోర్డ్ ఆఫ్ డెరైక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు పథకానికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని సంస్థ యాజమాన్యం సంబంధిత అధికారులను ఆదేశించింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సలహాదారుడు డీఎన్ ప్రసాద్, డెరైక్టర్ ఎస్‌డీ అషఫ్, ర వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ సీఎండీ ఆర్‌ఆర్ మిశ్రా, సింగరేణి డెరైక్టర్లు బి.రమేశ్ కుమార్, ఎ.మనోహర్ రావు, జె.పవిత్రన్ కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement