-
సింగరేణి రిటైర్డ్ కార్మికులకు కొత్త స్కీమ్
సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో పదవీ విరమణ చేసిన కార్మికులతోపాటు వాళ్ల జీవిత భాగస్వామికి రూ.5 లక్షల విలువైన వైద్య సేవలందించే కాంట్రిబ్యూటరీ పోస్టు రిటైర్మెంట్ మెడికల్ స్కీమ్ను సింగరేణి యాజమాన్యం ఆమోదించింది. శుక్రవారం సింగరేణి భవన్లో సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ అధ్యక్షతన జరిగిన బోర్డ్ ఆఫ్ డెరైక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పథకానికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని సంస్థ యాజమాన్యం సంబంధిత అధికారులను ఆదేశించింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సలహాదారుడు డీఎన్ ప్రసాద్, డెరైక్టర్ ఎస్డీ అషఫ్, ర వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ సీఎండీ ఆర్ఆర్ మిశ్రా, సింగరేణి డెరైక్టర్లు బి.రమేశ్ కుమార్, ఎ.మనోహర్ రావు, జె.పవిత్రన్ కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
సింగరేణికి బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డ్
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా అందించే బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు సింగరేణి సంస్థకు దక్కింది. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేతుల మీదుగా సీఎండీ ఎన్.శ్రీధర్ అవార్డు అందుకున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి 60.04 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి 15 శాతం వృద్ధిరేటుతో జాతీయ బొగ్గు రంగ పరిశ్రమలకే తలమానికంగా నిలిచింది. అలాగే బొగ్గు రవాణాలోనూ అగ్రస్థానంలో నిలిచి పాత రికార్డులను తిరగరాసింది. కార్మికులకు సంక్షేమ కార్యక్రమాల అమలు, పారిశ్రామిక సంబంధాల విషయంలో సీఎండీ చూపిన చొరవకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ మాట్లాడుతూ.. సింగరేణీయులు అందించిన సహకారం వల్లే సంస్థ అభివృద్ధి సాధించగలిగిందని ప్రశంసించారు. కార్మిక సంఘాల సహకారంతో సమ్మెలు లేని సంస్థగా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. అవార్డుకు ఎంపిక చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
పవర్ ప్రాజెక్ట్ పరిశీలించిన సింగరేణి చైర్మన్
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలో సిగరేణి సంస్థ కొత్తగా నిర్మిస్తున్న పవర్ ప్రాజెక్ట్ పనులను ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.శ్రీధర్ గురువారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఉద్యోగులకు సూచించారు. ఆయనతో పాటు ఇంకా కొంతమంది అధికారులు పాల్గొన్నారు. -
సింగరేణి సిగలో ‘బయ్యారం’
ఐరన్ ఓర్ వెలికితీతకు శ్రీకారం 2014-15లో 100 % బొగ్గు ఉత్పత్తి రూ.14083 కోట్ల ఆదాయం సెప్టెంబర్లోగా 5512 పోస్టులు భర్తీ సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: సింగరేణి సంస్థ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతోంది. బొగ్గు గనుల తవ్వకాల్లో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సింగరేణి త్వరలో ఐరన్ ఓర్ అన్వేషణ రంగంలో ప్రవేశించనుంది. ఇప్పటివరకు తెలంగాణ భూభాగంలోనే గనుల తవ్వకాలు జరిపిన సంస్థ సమీప భవిష్యత్తులో తన కార్యకలాపాలను దేశ విదేశాలకు విస్తరింపజేయనుంది. సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ సాధించిన పురోగతితోపాటు భవిష్యత్తు కార్యాచరణను వెల్లడించారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఖమ్మం జిల్లా బయ్యారంలో ఐరన్ ఓర్ నిక్షేపాల అన్వేషణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బయ్యారంలో నిక్షిప్తమై ఉన్న ఐరన్ఓర్ పరిమాణం, నాణ్యతపై 45 రోజుల్లో ప్రాథమిక అధ్యయనం జరపనున్నామని చెప్పారు. ఒడిషాలోని టాల్చేర్ వద్ద గల నైనీ బొగ్గుగనులను చేజిక్కించుకున్నామని, ఉత్కల్లోని బొగ్గు గను ల వేలంలో సైతం పాల్గొంటున్నామన్నారు. దక్షిణాఫ్రికా, ఇతర ఆఫ్రికా దేశాలు, ఆస్ట్రేలియా, ఇండోనేషియా దేశాల్లో బొగ్గు గనుల తవ్వకాలకు ఆసక్తిని ప్రదర్శిస్తూ ఈ నెల రెండోవారంలో గ్లోబల్ ప్రకటనను జారీ చేస్తామన్నారు. రాష్ట్రం లో సంస్థ 48 బ్లాకుల్లో బొగ్గు తవ్వకాలు జరుపుతుండగా.. మరో 14 కొత్త బ్లాకుల్లో తవ్వకాలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఎన్నడూలేని విధంగా 2014-15లో సింగరేణి మంచి ఫలి తాలు సాధించిందని శ్రీధర్ పేర్కొన్నారు. నిర్దేశిత లక్ష్యాల మేరకు 100 శాతం బొగ్గు ఉత్పత్తి జరిగిందని, గతేడాది బొగ్గు ఉత్పత్తిని 52 మిలి యన్ టన్నులకు పెంచామని, రానున్న నాలుగేళ్లలో 80 ఎం.టి.లకు తీసుకెళ్తామన్నారు. సింగరేణికి గోల్డెన్ పీకాక్ పురస్కారం.. గనుల తవ్వకాల్లో బయటపడిన మట్టితో నిర్మా ణ రంగ వస్తువులను తయారు చేసినందుకు సింగరేణిని గోల్డెన్ పీకాక్ ఎన్నోవేటివ్ ప్రాడక్ట్/సర్వీసు అవార్డు వరించింది. ఈ నెల 20న దుబాయ్లో యూఏఈ మంత్రి ముబారక్ల్ దీనిని ప్రదానం చేయనున్నారని తెలిపారు. సెప్టెంబర్లోగా 5 వేల ఉద్యోగాలు ఈ ఏడాది సెప్టెంబర్లోగా సంస్థలో 5512 ఉద్యోగాలను భర్తీ చేస్తామని సింగరేణి సీఎండీ శ్రీధర్ పేర్కొన్నారు. అందులో 2744 పోస్టులను సంస్థ ఉద్యోగుల సంబంధీకులకు, 539 పోస్టులను పదోన్నతుల ద్వారా, 2229 పోస్టులను బయటి వ్యక్తులకు కేటాయించామన్నారు. ఉద్యోగాల నియామకాల్లో ఇంటర్వ్యూలకు స్వస్తి పలికామని, రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగానే నియామకాలు జరుపుతామన్నారు. కొత్తగూడెం, సింగరేణి ప్రాంతాల్లో సంస్థ ఆధ్వర్యంలో వైద్య కళాశాల ఏర్పాటు చేసే అంశంపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామన్నారు. -
ప్రతి ఇంటికీ రెండు బ్యాంకు ఖాతాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రతి ఇంట్లో భర్తతోపాటు భార్యకూ బ్యాంకు ఖాతా ఉండేలా కేంద్రప్రభుత్వం జన్ధన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ ఎన్.శ్రీధర్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని ఎస్బీహెచ్లో జన్ధన్ యోజన ఖాతాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేద, బలహీన వర్గాల అభ్యున్నతికి ఈ పథకం దోహదపడుతుందన్నారు. ఎలాంటి ప్రీమియం లేకుండా ఖాతాదారులకు రూ. లక్ష బీమాతో కూడిన జీరో బ్యాలెన్స్ ఖాతాను తెరవడం జరుగుతుందన్నారు. కలెక్టరేట్లోని ఎస్బీహెచ్ బ్రాంచ్లో 300 ఖాతాల లక్ష్యం త్వరలో పూర్తి కానున్నట్లు చెప్పారు. ఖాతాలు తెరిచిన వారికి కలెక్టర్ పాసుపుస్తకాలు అందజేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement