పోస్ట్ లో మంత్రులకు చీరలు, గాజులు


ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్నలకు చీరలు, గాజు లను పోస్ట్ చేశారు. జిల్లా గిరిజన వర్సిటీ సాధన సమితి, అఖిలపక్షం, విద్యార్థి సంఘాలు శనివారం ఈ చర్యతో తమ నిరసన తెలిపాయి. జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలని నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన వర్సిటీ సాధన సమితి కన్వీనర్ రితేష్ రాథోడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, బీజేపీ నాయకులు నగేష్, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. 



 

Read also in:
Back to Top