సికింద్రాబాద్ లో సిలిండర్ల లారీ బీభత్సం


హైదరాబాద్: సికింద్రాబాద్ లో ఓ సిలిండర్ల లారీ బీభత్సం సృష్టించింది. స్థానిక ఆనంద్ థియేటర్ వద్ద మంగళవారం ఉదయం లారీ ఒక్కసారిగా వాహనదారులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న యువకుడు మృతిచెందాడు. ఈ ప్రమాద ఘటనతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కిలోమేటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

 



 

Read also in:
Back to Top