వలలో కొండచిలువ పడింది


నర్సరావుపేట : చేపల కోసం వేసిన వలలో కొండ చిలువ చిక్కింది. దీంతో జాలరులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పాలపాడులో శనివారం చోటు చేసుకుంది. స్థానిక జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు.  ఈ సందర్భంగా జాలర్లు విసిరిన వలలో చేపలతో పాటు కొండచిలువ పడింది.  శనివారం ఒడ్డుకు వచ్చిన జాలర్లు... వలను తీసి చూడాగా అందులో కొండచిలువ ఉంది. ఆ విషయాన్ని గమనించిన జాలర్లు భయాందోళనలకు గురై దూరంగా పరుగులు తీశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top