బయోమెట్రిక్ కోసం వెళ్లి..


- వడదెబ్బతో ఒకరి మృతి

జవహర్‌నగర్


రేషన్‌షాపు వద్ద బయోమెట్రిక్ కోసం ఎండలో నిలబడిన ఓ వ్యక్తి వడదెబ్బకు గురై మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్ గిరిప్రసాద్‌నగర్‌లో  బుధవారం ఈ విషాదం చోటుచేసుకుంది.




వివరాలు.. గబ్బిలాలపేటలోని రేషన్ దుకాణంలో బయోమెట్రిక్ విధానం కోసం బుధవారం అధికారులు వేలిముద్రలు తీసుకున్నారు. ఈక్రమంలో గిరిప్రసాద్‌నగర్‌కు చెందిన మహమ్మద్ ఇబ్రహీం(44) ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్యూలో నిలబడి వేలిముద్రలు ఇచ్చాడు. ఇంటికి వచ్చిన అతడు మంచినీళ్లు తాగిన వెంటనే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోగానే కన్నుమూశాడు. అతడు వడదెబ్బతోనే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top