తిరుమలలో హై అలర్ట్
► ఆలయం వ ద్ద విస్తృతంగా తనిఖీలు
సాక్షి,తిరుమల: హైదరాబాద్లో ఐసిస్ సానుభూతిపరుల అరెస్ట్ నేపథ్యంలో ఏపీలో భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగా శుక్రవారం తిరుమలలో హైఅలర్ట్ ప్రకటించి శ్రీవారి ఆల యం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆలయంలోకి వెళ్లే అన్నిమార్గాల్లోనూ తనిఖీ వ్యవస్థను పటిష్టం చేశారు. భక్తులను నిశితంగా తనిఖీ చేసి అనుమతిస్తున్నారు.
ఇక ఆలయం వెలుపల కూడా నిఘా వ్యవస్థ అప్రమత్తమైంది. ఆలయ నాలుగు మాడ వీధుల్లోనూ యాక్షన్ టీంగా పరిగణించే ఆక్టోపస్ దళాలు మఫ్టీల్లో గస్తీ తిరిగాయి. కల్యాణకట్ట, నిత్యాన్నప్రసాదం వద్ద కూడా భద్రతను పటిష్టం చేశారు. సీసీ కెమెరా వ్యవస్థ ద్వారా జనం కదలికలపై నిఘా పెట్టారు.