బంగారానికి పూజ చేస్తామని చెప్పి..
కీసర: బంగారానికి పూజ చేసి ఇస్తామని చెప్పి ఓ మహిళను మోసం చేసిన సంఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది. రాంపల్లి గ్రామానికి చెందిన కూరగాయలు అమ్ముకునే దేవమ్మ అనే మహిళ వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చి మీ బంగారానికి పూజ చేస్తామని మాయమాటలు చెప్పారు.
వీరి మాటలు నమ్మిన ఆ మహిళ ఆదమరిచి ఉండగా నాలుగు తులాల పుస్తెలతాడు ఎత్తుకెళ్లారు. కొద్దిసేపటికి తేరుకున్న బాధితురాలు కీసర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.