చంద్రబాబు దళితద్రోహి

చంద్రబాబు దళితద్రోహి - Sakshi

 

 వైఎస్సార్‌ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున

 

గుంటూరు (పట్నంబజారు) : దళిత, గిరిజనుల సంక్షేమానికి చంద్రబాబు సర్కార్‌ తిలోదకాలిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున నిప్పులు చెరిగారు. గుంటూరులోని పార్టీ జిల్లా  కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ లేనప్పుడు నోడల్‌ ఏజెన్సీ ద్వారా వారి సంక్షేమానికి కృషిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటివరకు సబ్‌ ప్లాన్‌లో 70 శాతం నిధులు ఖర్చుచేయకపోగా, వాటిని ఇతరత్ర అవసరాలకు ఖర్చుచేసేందుకు జీవో జారీచేయడం ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు.  సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు చంద్రబాబు ఆస్థానంలో గంగిరెద్దులా మారారని విమర్శించారు. ప్రత్యేక హోదాపై విద్యార్థులు, యువత, ప్రశ్నిస్తే పీడీ యాక్ట్‌ పెట్టమంటున్న మంత్రులు చంద్రబాబు చేస్తున్న పనులకు తీవ్రవాద కేసు పెట్టాలన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అవాకులు చవాకులు పేలుతున్న మంత్రు ల తోలును ప్రజలే వలుస్తారన్నారు. దళిత ద్రోహులు చంద్రబాబు, రావెలను నిలదీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి లే ళ్ల అప్పిరెడ్డి  పాల్గొన్నారు.

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top