మోహన్ను కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ అధికారులు
కాకినాడ : అక్రమాస్తుల కేసులో కాకినాడ డీటీసీ మోహన్ను ఏసీబీ అధికారులు శనివారం విజయవాడలోని కోర్టులో హాజరుపరిచారు. డీటీసీ మోహన్కు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి 15 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం ఏసీబీ అధికారులు అతడిని కృష్ణాజిల్లా చల్లపల్లి జైలుకు తరలించారు. తూర్పుగోదావరిజిల్లా కాకినాడలో డీటీసీగా విధులు నిర్వహిస్తున్న ఏ మోహన్ భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో గురువారం ఏసీబీ అధికారులు మోహన్ నివాసంతోపాటు అతడి బంధువుల నివాసాలపై ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో దాదాపు రూ. 100 కోట్లు అక్రమాస్తులు వెలుగులోకి వచ్చినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. దీంతో అతడిని అరెస్ట్ చేసి... శనివారం విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.