లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్తో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. గ్రీస్ సంక్షోభం ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా మరోసారి ఆసియాలో మరోసారి మాంద్యం పరిస్ధితులు తలెత్తుతాయనే అమోమయంలో ఇన్వెస్టర్లు ఆచితూచీ అడుగులేస్తున్నారు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు 176 పాయింట్ల లాభంతో 27వేల 957పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా , నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో 8420 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
ఇక సెక్టార్ సూచీల్లో హెల్త్ కేర్ 1.28శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.10శాతం, ఐటి సూచీలు 1.06శాతం, రియాల్టీ 1.22శాతం లాభపడుతున్నాయి. ఇక నిఫ్టీ టాప్ గేయిన్ర్స్ లిస్ట్లో అంబుజా సిమెంట్ 2.33శాతం, సిప్లా 1.71శాతం, హెచ్సిఎల్ టెక్ 1.66శాతం, ల్యూపిన్ 1.64శాతం లాభపడుతుండగా, నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్ట్లో జీల్ 1.26శాతం, ఎన్ఎమ్ డిసి 1.05శాతం, గెయిల్ 0.57శాతం నష్టపోయాయి.