`జగన్‌ ముఖ్యమంత్రై కేంద్రస్థాయిలో ఎదుగుతారు` | ys jagan mohan reddy will pay key role in national politics, says Adinarayana reddy | Sakshi
Sakshi News home page

`జగన్‌ ముఖ్యమంత్రై కేంద్రస్థాయిలో ఎదుగుతారు`

Dec 21 2013 7:06 PM | Updated on Jul 25 2018 4:07 PM

`జగన్‌ ముఖ్యమంత్రై కేంద్రస్థాయిలో ఎదుగుతారు` - Sakshi

`జగన్‌ ముఖ్యమంత్రై కేంద్రస్థాయిలో ఎదుగుతారు`

జగన్‌ ముఖ్యమంత్రై కేంద్రస్థాయిలో ఎదుగుతారని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరులో శనివారం సమైక్య శంఖారావం సభను ఏర్పాటు చేశారు.

వైఎస్సార్ జిల్లా:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రై కేంద్రస్థాయిలో ఎదుగుతారని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరులో శనివారం సమైక్య శంఖారావం సభను ఏర్పాటు చేశారు. ఈ శంఖారావం సభలో పాల్గొన్న ఆదినారాయణరెడ్డి,  జగన్ నాయకత్వంలో రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని చెప్పారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి కూడా ఈ సభలో పాల్గొన్నారు.

 

కాగా, రాష్ట్ర విభజన పాపం కిరణ్‌, చంద్రబాబులదేనని వైఎస్‌ అవినాష్‌రెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాన్ని.. దేశవ్యాప్తంగా ఆలోచింప చేసిన వ్యక్తి ఒక్క జగన్‌ మాత్రమేనని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement