రాష్ట్రపతిని కలసిన వైఎస్ జగన్
మర్యాదపూర్వక భేటీయేనన్న పార్టీవర్గాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేసిన భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం రాత్రి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జగన్ వెంట వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్రెడ్డి, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో సమావేశమైనపుడు వారిని ప్రణబ్ ఆప్యాయంగా పలుకరించారు.
జగన్ తల్లి వైఎస్ విజయమ్మ గురించి వాకబు చేశారు. రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చారు కనుక.. కేవలం మర్యాదపూర్వకంగానే జగన్ ఆయన్ను కలిశారని, భేటీకి ఇతరత్రా ప్రాధాన్యమేమీ లేదని పార్టీ వర్గాలు తెలిపాయి.