వైఎస్ఆర్సీపీ నేతలపై దుండగుల దాడి


పాయకరావుపేట: విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం పాల్మన్‌పేటలో కొంతమంది దుండగులు బీభత్సం సృష్టించారు. మంగళవారు ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలోకి ప్రవేశించి కర్రలతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ సర్పంచి, ఎంపీటీసీ సహా నలబై మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దుండగులను తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరులుగా అనుమానిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top