అమలాపురం టౌన్ : అమలాపురం కల్వకొలను వీధికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నార్ని చంద్రశేఖర్ నాయుడు (24) హత్యకేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఇద్దరిని పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ సోమవారం అరెస్టు చేశారు. మేనమామ కుమారుడైన పదో తరగతి విద్యార్థే ఈ హత్యకు సూత్రధారి. చంద్రశేఖర్ను హత్యకు పాల్పడిన నిందితుల్లో ఒకరు 17 ఏళ్ల పాలిటెక్నిక్ విద్యార్థి కూడా ఉన్నాడు. కేసు వివరాలను డీఎస్పీ ఎల్. అంకయ్య, సీఐ శ్రీనివాస్ మంగళవారం స్థానిక పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. గత నెల 24న ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం సముద్రతీరంలో చంద్రశేఖర్ నాయుడు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఒకరు హతుడి మేనమామ కుమారుడు ఒకరు కాగా, పాలిటెక్నిక్ విద్యార్థి మరొకరు. వీరిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మరో ఇద్దరు నిందితులు నల్లా దుర్గావెంకటసాయిరామ్, నూకల దుర్గారావును పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నగలు, ఏటీఎం కార్డు, హత్యకు ఉపయోగించిన కర్రను స్వాధీనం చేసుకున్నారు.
ఆస్తి తగాదాల వల్లే..
అమలాపురం కల్వకొలను వీధికి చెందిన కల్వకొలను నారాయణరావుకు కుమారుడు లీలా బాలాజీ, కుమార్తె నార్ని వెంకట వరలక్ష్మి అనే చిలకమ్మ ఉన్నారు. వారిద్దరికీ వివాహాలు అయ్యాయి. కుమారుడి కుటుంబం, కుమార్తె కుటుంబం కల్వకొలను వీధిలో వేర్వేరు చోట్ల ఉంటున్నాయి. నారాయణరావు తన మనుమడు చంద్రశేఖర్నాయుడి (కుమార్తె కుమారుడు)పై ఎక్కువగా ప్రేమ చూపేవారు. ఈ క్రమంలో కుమారుడి కొడుక్కి (టెన్త్ విద్యార్థి) ఇది నచ్చలేదు. ఆ రెండు కుటుంబాల మధ్య ఆస్తి తగాదాలు తలెత్తాయి. తన తాతకు చెందిన కోట్ల ఆస్తిని తన బావకు ఇచ్చేస్తాడని భావించి ఆ బాలుడు కక్షపెంచుకున్నాడు. ఎలాగైనా బావను అంతమొందించాలని పథకం పన్నాడు. అదే వీధికి చెందిన నల్లా దుర్గా వెంకటసాయిరామ్తో రూ.80 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. రూ.20 వేలు అడ్వాన్సుగా ఇచ్చాడు.
హత్యకు పథకం పన్నిందిలా..
సాయిరామ్ తన స్నేహితులైన నూకల దుర్గారావు, పాలిటెక్నిక్ విద్యార్థిని సహాయకులుగా చేసుకుని గత నెల 24న ఎస్.యానాం సముద్ర తీరంలో హత్య చేసేందుకు పథకం పన్నాడు. చంద్రశేఖర్కు సాయిరామ్ ఫోన్ చేసి ఎస్.యానాం బీచ్లో ఒక అమ్మాయి ఉంది. త్వరగా రమ్మని ఫోన్ చేశాడు. అప్పటికే సాయిరామ్ తన స్నేహితులైన దుర్గారావు, పాలిటెక్నిక్ విద్యార్థి కాపుకాసి ఉన్నారు. చంద్రశేఖర్ మోటారు సైకిల్పై బీచ్కు వచ్చాడు. కొద్దిసేపు బీచ్లో స్నానాలు చేసి ఫొటోలు తీసుకున్న అనంతరం చంద్రశేఖర్ తలపై ఈలకర్రతో బలంగా మోది, అతడి పీక నులిమి హత్య చేశారు. మృతదేహాన్ని ఇసుకలో పాతిపెట్టారు. మృతుడి వద్ద ఉన్న బంగారు గొలుసు, ఉంగరం, మోటారు సైకిల్ తీసుకుని ఆ ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు. రెండు రోజులకు చంద్రశేఖర్ మృతదేహం కెరటాల ఉధృతికి ఇసుకలోంచి బయట పడటం, అది తమ కొడుకుదేనని అతడి తల్లిదండ్రులు గుర్తించటం పాఠకులకు తెలిసిందే. ఇప్పుడు ఇద్దరి నిందితులను అరెస్ట్ చేశామని, మిగిలిన ఇద్దరు బాలురిని అరెస్టు చేయాల్సి ఉందని డీఎస్పీ అంకయ్య చెప్పారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన క్రైం పార్టీ హెడ్ కానిస్టేబుల్ అయితాబత్తుల బాలకృష్ణ, కానిస్టేబుళ్లు బత్తుల రామచంద్రరావు, వి.వరహాలు, గుత్తుల సాయిలను డీఎస్పీ అభినందించారు.
వీడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్యకేసు మిస్టరీ
Published Wed, Aug 19 2015 1:42 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన రేఖా ఝున్ఝున్వాలా
సీఎం జగన్ కోసం రాజానగరం సిద్ధం(ఫొటోలు)
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement