శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు జడ్జి
తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగదీష్సింగ్ కెహర్ ఆదివారం దర్శించుకున్నారు. జస్టిస్ కెహర్ కుటుంబ సభ్యులతో కలసి శనివారం తిరుమలకు వెళ్లారు. శనివారం రాత్రి గరుడ వాహన సేవలో పాల్గొన్నారు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలసి వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు.