అక్రమ అరెస్ట్లు ఆపండి: వైఎస్ జగన్
హైదరాబాద్: సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా కార్యకర్తలకు మద్దతుగా వైఎస్ జగన్ బుధవారం ట్వీట్ చేశారు.
సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం, వేధింపులకు పాల్పడటం లాంటి చర్యలను ఆపాలని, ప్రభుత్వ పాలనాతీరు చూస్తుంటే జాలేస్తుందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. మరోవైపు సుప్రీకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ సైతం సోషల్ మీడియా స్వచ్ఛంద కార్యకర్తల అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు అనాగరికం, అప్రజాస్వామికమని, ఏపీ ప్రభుత్వాన్ని వెంటనే డిస్మిస్ చేయాలని కర్జూ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రికి ఆయన లేఖ రాశారు.
Stop illegal arrests and harassing of social media activists. Shame on your governance. #SaveDemocracy @mkatju
— YS Jagan Mohan Reddy (@ysjagan) 17 May 2017