సాక్షి టీవీ చానల్ లేకపోతే కనెక్షన్ వద్దు


సాలూరు: కేబుల్ ప్రసారాల్లో సాక్షి టీవీ లేకపోతే ఏకంగా కేబుల్ కనెక్షన్‌ను తొలగించుకుంటామని సిటీ కేబుల్ ఆపరేటర్‌కు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు స్పష్టం చేశారు. పార్టీ పట్టణ అద్యక్షుడు జరజాపు సూరిబాబు ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్లు బోను అప్పారావు, కౌన్సిలర్ ప్రతినిధి జరజాపు శ్రీను, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పెదకోమటిపేటలోని సిటీ కేబుల్ కార్యాలయానికి వెళ్లారు.



సాక్షి టీవీ ప్రసారాలను పునరుద్ధరించాలని నినాదాలు చేసారు. అనంతరం కార్యాలయంలో సిటీ కేబుల్ యజమాని లేకపోవడంతో టెక్నీషియన్‌తో మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లో సాక్షి చానెల్‌ను ప్రసారం చేయకపోతే ఏకంగా కేబుల్ కనెక్షన్‌నే తొలగిస్తామని, నెలవారీ రుసుమును కూడా చెల్లించేది లేదని స్పష్టం చేసారు. అనంతరం సూరిబాబు మాట్లాడుతూ టీటీపీ ప్రభుత్వ కుట్రలో కేబుల్ ఆపరేటర్ల పావులుగా మారితే వారే తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు.



 కార్యక్రమంలో పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి గొర్లె వెంకటరమణ, పట్టణ, రాష్ట్ర యువజన విభాగం నాయకులు మద్దిల గోవింద, యశోదకృష్ణ, హరి ఈశ్వరరావు, జిల్లా బీసీ విభాగం నాయకుడు మేడిశెట్టి అప్పలనాయుడు, మాజీ కౌన్సిలర్లు కొల్లి రమణ, పిరిడి రామకృష్ణ, పార్టీ నాయకులు యాశర్ల రాము, కొలకోటి శంకరరావు, సబ్బాన తిరుపతి, హరి స్వామినాయుడు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top