సర్వాంగ సుందరంగా ఉద్దండరాయునిపాలెం
తుది మెరుగులు దిద్దుకుంటున్న వేదికలు
ప్రాంగణంలో సంకల్ప జ్యోతి వెలిగించిన సీఎం
రెండు గంటల పాటు సభ ఏర్పాట్ల పరిశీలన
కంపార్టుమెంట్లలో సీటింగ్పైనే ప్రధానంగా చర్చ
రైతులకు, వీఐపీలకు తొలి వరుసలో ప్రాధాన్యం
ఏర్పాట్లు పరిశీలించిన 16మంది రాష్ట్ర మంత్రులు
సందర్శకులకు అనుమతి నిరాకరణ
విజయవాడ : రాజధాని శంకుస్థాపన ప్రదేశం ఉద్దండరాయునిపాలెం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సభాప్రాంగణంలో పనులన్నీ శరవేగంగా సాగుతున్నాయి. మరో 24 గంటల వ్యవధిలో కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ప్రాంగణం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. వేదిక నిర్మాణం మొదలుకొని కంపార్టుమెంట్ల వరకు ఇప్పటికే నిర్మాణాలు పూర్తయ్యాయి.
పార్కింగ్ ప్రదేశాలతోపాటు ఉద్దండరాయునిపాలెం చేరుకోవడానికి ఉన్న తొమ్మిది ప్రధాన రహదార్లకు మరమ్మతులు పూర్తిచేసి సిద్ధం చేశారు. సందర్శకుల తాకిడి అధికంగా ఉండడంతో పనుల్లో జాప్యం జరుగుతోందని, ప్రధాని భద్రతకు విఘాతం కలుగుతుందనే కారణంతో సందర్శకుల అనుమతిపై పూర్తిస్థాయిలో ఆంక్షలు విధించి సభాప్రాంగణం అంతా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు శంకుస్థాపన జరిగే ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. మరోవైపు సభా ప్రాంగణంలో ప్రధాని ఆశీనులయ్యే వేదిక నిర్మాణం పూర్తయింది. ఎస్పీజీ సూచనలతో ప్రత్యేక వేదికలు నిర్మించారు. 12 లక్షల అడుగుల మేర భారీ షెడ్లను కంపార్టుమెంట్ల కోసం నిర్మించారు. మొత్తం 12 కంపార్టుమెంట్లు ఏర్పాటు చేసి ఒక్కొక్క కంపార్టుమెంట్లో 20 వేల మందికి సీటింగ్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కంపార్టుమెంట్ను ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, జిల్లాస్థాయి అధికారి పర్యవేక్షించనున్నారు.
సంకల్ప జ్యోతి వెలిగించిన సీఎం..
మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు సంకల్ప జ్యోతిని సభాప్రాంగణంలో చంద్రబాబు వెలిగించారు. అంతకు ముందు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో ఏర్పాటుచేసిన ప్రాంగణానికి చేరుకున్న పవిత్ర మట్టి, నీటి కలశాలకు సీఎం ప్రత్యేక పూజలు, సర్వమత ప్రార్థనలు నిర్వహించి జెండా ఊపి ప్రదర్శన ప్రారంభించారు. అక్కడి నుంచి 13 జిల్లాల నుంచి వచ్చిన వాహనాలు, రాష్ట్రంలోని ప్రసిద్ధి పుణ్య క్షేత్రాల నమూనా దేవాలయాలతో ఉన్న వాహనాలు సభాప్రాంగణానికి చేరుకున్నాయి. క్రీడాజ్యోతి వెలిగించిన అనంతరం ముఖ్యమంత్రి రెండు గంటల సేపు సభాప్రాంగణంలో కలియదిరిగి అన్ని ఏర్పాట్లు పరిశీలించారు. సీఎంతోపాటు 16 మంది రాష్ట్రమంత్రులు ఏర్పాట్లు పరిశీలించారు. ఇంకోవైపు బుధవారం నుంచి యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే హోమ ద్రవ్యాలు తీసుకువచ్చారు.
పీఎం కాన్వాయ్ ట్రయల్న్
ప్రధాన మంత్రి కాన్వాయ్ ట్రయల్ రన్ను పోలీసు అధికారులు నిర్వహించారు. దీంతోపాటు గన్నవరం విమానాశ్రయం నుంచి కూడా ఎయిర్ఫోర్స్కు చెందిన రెండు హెలికాప్టర్లు ట్రయల్ రన్ నిర్వహించాయి.
అపురూపం
Published Wed, Oct 21 2015 3:39 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)
దాక్షాయణి బర్త్ డే.. పుష్ప మేకర్స్ స్పెషల్ అప్డేట్!
దేవర బర్త్ డే ట్రీట్.. అప్డేట్ అదిరిపోయింది!
‘బీజేపీకి ఓటేస్తే నేను జైలుకే’.. కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్ రైతు వ్యతిరేక చర్యలు.. రాష్ట్రవ్యాప్త నిరసనకు కేసీఆర్ పిలుపు
మాజీ గవర్నర్ కమలా బెనివాల్ కన్నుమూత
ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్.. సాధారణ తీర్పు కాదన్న అమిత్ షా
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
తప్పక చదవండి
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement