-
రాజధాని పేరిట అక్రమ దందా
పెద్ద కొడుక్కి విరాళమట! పింఛను సొమ్ములో రూ.100 కోత జన్మభూమి కమిటీల తీర్మానాలంటూ తెలుగు తమ్ముళ్ల హడావుడి ప్రశ్నిస్తే.. పింఛను రాదంటూ హెచ్చరికలు కౌతవరం బ్యాంకు ప్రాంగణంలో బాహాటంగా వసూళ్లు రెండు జిల్లాల్లో రూ.7 కోట్ల వసూలు లక్ష్యం! రాజధాని శంకుస్థాపన పేరుతో వందల కోట్ల రూపాయలు ఇష్టారాజ్యంగా ఖర్చు చేసిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు రాజధాని నిర్మాణం పేరుతో అక్రమ వసూళ్లకు తెరతీసింది. జన్మభూమి కమిటీల పేరుతో తెలుగు తమ్ముళ్లే బహిరంగంగా ఈ వసూళ్లకు దిగుతున్నారు. ప్రశ్నించిన వారిని పింఛను రాదంటూ బెదిరింపులకు దిగుతున్నారు. విరాళం అంటే ఎవరైనా తమ ఇష్టపూర్వకంగా ఇచ్చేదై ఉండాలి.. కానీ ముందే రూ.100 చొప్పున కోత విధించి మిగిలినదే చేతిలో పెడుతుండటం శోచనీయం. విజయవాడ : రాజధాని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు సరికొత్త దందాకు తెరతీశారు. ఇసుక మొదలుకొని మద్యం షాపుల వరకు దేనినీ వదలని ‘తెలుగు’ తమ్ముళ్లు ఆఖరికి పింఛనుదారుల నుంచీ బలవంతపు వసూళ్లు చేస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే ఇకపై పింఛను రాదంటూ బెదిరిస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పింఛనుదారుల నుంచి రాజధాని నిర్మాణానికి విరాళం పేరుతో పింఛను మొత్తంలో రూ.100 కోత విధించే కార్యక్రమాన్ని చేపట్టారు. గత వారం రోజుల నుంచే జన్మభూమి కమిటీలు తీర్మానం చేశామంటూ హడావుడి చేసి ఈ నెల రెండో తేదీ నుంచి ఈ వసూళ్లు మొదలుపెట్టాయి. గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో ఫించనుదారులు అక్రమ వసూళ్ల పర్వాన్ని నిలదీయడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గ్రామాల్లో అలజడి... ప్రతి ఇంటికి పెద్ద కొడుకై వెయ్యి రూపాయల పింఛను నెలనెలా ఇస్తున్నాడు. అందులో రూ.100 విరాళం రాజధాని నిర్మాణం కోసం పెద్ద కొడుక్కి ఇవ్వలేరా.. అంటూ వసూళ్లకు తెగబడుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు వసూళ్ల బాధ్యత పంచాయతీ సర్పంచ్, స్థానిక జన్మభూమి కమిటీలపై పెట్టడంతో గ్రామాల్లో అలజడి మొదలైంది. రెండు జిల్లాల్లో కలిపి 7.01 లక్షల మంది అన్ని కేటగిరీల పింఛనుదారులు ఉన్నారు. వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలకు రూ.67.89 కోట్లు నెలనెలా బ్యాంకుల ద్వారా చెల్లిస్తున్నాయి. మరో వారం వ్యవధిలోనే రెండు జిల్లాల్లో కలిపి రూ.7 కోట్లు వసూలు చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఇచ్చే సొమ్ములో ముందే కోత... జీవిత చరమాంకంలో ఉన్న వృద్ధులు, తోడు కోల్పోయి అనాథలుగా మారిన వితంతువులు, అంగవైకల్యంతో ఉన్న వికలాంగులపై జాలి చూపాల్సింది పోయి.. వారికి ఇచ్చే అరకొర సొమ్ములోనే విరాళాల పేరుతో అడ్డగోలు వసూళ్లకు తెగబడటం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఎమ్మెల్యేలే బహిరంగంగా ప్రకటనలు చేసి మరీ రూ.100 విరాళం ఇవ్వాలని కోరుతుండగా, ఇక్కడ మాత్రం జన్మభూమి కమిటీల పేరుతో వసూళ్లు సాగిస్తున్నారు. బ్యాంకర్లతో ముందే మాట్లాడుకుని ఇచ్చే పింఛను మొత్తంలో నుంచి రూ.100 ముందే కోత విధించి మిగిలిన సొమ్ము లబ్ధిదారులకు ఇచ్చేలా ప్లాన్ చేయటం గమనార్హం. మంగళవారం కౌతవరం ఆంధ్రాబ్యాంకు ప్రాంగణంలోనే టీడీపీ నేతలు ఈ వసూళ్లకు తెగబడటం వివాదాస్పదమైంది. తమకు ఏ గతీ లేక పింఛను తీసుకొని బతుకుతున్నామని, అందులోనూ కోత విధిస్తే ఎలా అని ప్రశ్నించారు. రాజధానికి ఎందుకివ్వాలి రాజధాని నిర్మాణానికి పింఛనుదారుల నుంచి డబ్బులు లాగేసుకుంటున్నారు. వృద్ధులు, వికలాంగులకు ఇచ్చే డబ్బుల్లో ముందే కోత విధించి పింఛను ఇవ్వటం విడ్డూరంగా ఉంది. అసలు రాజధాని నిర్మాణానికి చందాలు పింఛనుదారులే ఎందుకు ఇవ్వాలి. ఇష్టమైతే చందా ఇస్తారు గాని బలవంతంగా లాక్కుంటారా? - దాసి రాధాకృష్ణ, కౌతవరం శివారు బలరామపురం కమిటీ నిర్ణయిస్తే దందా చేస్తారా? గ్రామంలో చంద్రబాబు చెబితే కమిటీ వేసుకున్నారట. ఆ కమిటీ చెప్పిన మేరకు ఈ వసూళ్లు చేస్తుంటే మేము చూస్తా ఊరుకోవాలా? వందేసి రూపాయలు బలవంతంగా వసూలు చేయటం దారుణంగా ఉంది. దానికి రాజధాని నిర్మాణం పేరు పెట్టి ఏదో బాకీలాగా బలవంతంగా వసూలు చేస్తున్నారు. - బోలపాటి నిర్మల, కౌతవరం శివారు బలరామపురం -
ఆ రోజు హోదా ప్రకటిస్తారని చెప్పారా ?
విలేకర్లతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొరిటెపాడు(గుంటూరు): రాజధాని శంకుస్థాపన రోజు ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ ప్రకటిస్తారని ఎవరైనా చెప్పారా? అని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం, రాష్ట్రం మధ్య చిచ్చుపెట్టాలని విపక్షాలు చూస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రధానమంత్రి ప్రసంగాన్ని నిరసిస్తూ విపక్షాలు చేస్తున్న ఆందోళనలపై మంత్రి పుల్లారావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష పార్టీలు ముఖం చెల్లక శంకుస్థాపనకు రాలేదని ఆరోపించారు. -
అపురూపం
సర్వాంగ సుందరంగా ఉద్దండరాయునిపాలెం తుది మెరుగులు దిద్దుకుంటున్న వేదికలు ప్రాంగణంలో సంకల్ప జ్యోతి వెలిగించిన సీఎం రెండు గంటల పాటు సభ ఏర్పాట్ల పరిశీలన కంపార్టుమెంట్లలో సీటింగ్పైనే ప్రధానంగా చర్చ రైతులకు, వీఐపీలకు తొలి వరుసలో ప్రాధాన్యం ఏర్పాట్లు పరిశీలించిన 16మంది రాష్ట్ర మంత్రులు సందర్శకులకు అనుమతి నిరాకరణ విజయవాడ : రాజధాని శంకుస్థాపన ప్రదేశం ఉద్దండరాయునిపాలెం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సభాప్రాంగణంలో పనులన్నీ శరవేగంగా సాగుతున్నాయి. మరో 24 గంటల వ్యవధిలో కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ప్రాంగణం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. వేదిక నిర్మాణం మొదలుకొని కంపార్టుమెంట్ల వరకు ఇప్పటికే నిర్మాణాలు పూర్తయ్యాయి. పార్కింగ్ ప్రదేశాలతోపాటు ఉద్దండరాయునిపాలెం చేరుకోవడానికి ఉన్న తొమ్మిది ప్రధాన రహదార్లకు మరమ్మతులు పూర్తిచేసి సిద్ధం చేశారు. సందర్శకుల తాకిడి అధికంగా ఉండడంతో పనుల్లో జాప్యం జరుగుతోందని, ప్రధాని భద్రతకు విఘాతం కలుగుతుందనే కారణంతో సందర్శకుల అనుమతిపై పూర్తిస్థాయిలో ఆంక్షలు విధించి సభాప్రాంగణం అంతా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు శంకుస్థాపన జరిగే ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. మరోవైపు సభా ప్రాంగణంలో ప్రధాని ఆశీనులయ్యే వేదిక నిర్మాణం పూర్తయింది. ఎస్పీజీ సూచనలతో ప్రత్యేక వేదికలు నిర్మించారు. 12 లక్షల అడుగుల మేర భారీ షెడ్లను కంపార్టుమెంట్ల కోసం నిర్మించారు. మొత్తం 12 కంపార్టుమెంట్లు ఏర్పాటు చేసి ఒక్కొక్క కంపార్టుమెంట్లో 20 వేల మందికి సీటింగ్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కంపార్టుమెంట్ను ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, జిల్లాస్థాయి అధికారి పర్యవేక్షించనున్నారు. సంకల్ప జ్యోతి వెలిగించిన సీఎం.. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు సంకల్ప జ్యోతిని సభాప్రాంగణంలో చంద్రబాబు వెలిగించారు. అంతకు ముందు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో ఏర్పాటుచేసిన ప్రాంగణానికి చేరుకున్న పవిత్ర మట్టి, నీటి కలశాలకు సీఎం ప్రత్యేక పూజలు, సర్వమత ప్రార్థనలు నిర్వహించి జెండా ఊపి ప్రదర్శన ప్రారంభించారు. అక్కడి నుంచి 13 జిల్లాల నుంచి వచ్చిన వాహనాలు, రాష్ట్రంలోని ప్రసిద్ధి పుణ్య క్షేత్రాల నమూనా దేవాలయాలతో ఉన్న వాహనాలు సభాప్రాంగణానికి చేరుకున్నాయి. క్రీడాజ్యోతి వెలిగించిన అనంతరం ముఖ్యమంత్రి రెండు గంటల సేపు సభాప్రాంగణంలో కలియదిరిగి అన్ని ఏర్పాట్లు పరిశీలించారు. సీఎంతోపాటు 16 మంది రాష్ట్రమంత్రులు ఏర్పాట్లు పరిశీలించారు. ఇంకోవైపు బుధవారం నుంచి యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే హోమ ద్రవ్యాలు తీసుకువచ్చారు. పీఎం కాన్వాయ్ ట్రయల్న్ ప్రధాన మంత్రి కాన్వాయ్ ట్రయల్ రన్ను పోలీసు అధికారులు నిర్వహించారు. దీంతోపాటు గన్నవరం విమానాశ్రయం నుంచి కూడా ఎయిర్ఫోర్స్కు చెందిన రెండు హెలికాప్టర్లు ట్రయల్ రన్ నిర్వహించాయి. -
22న జరిగే శంకుస్థాపన చరిత్రాత్మకం
♦ అమరావతి సంకల్పజ్యోతిని అందుకున్న ముఖ్యమంత్రి ♦ ప్రధాన వేదిక, హెలిప్యాడ్లు, రోడ్ల పనుల పరిశీలన ♦ బందోబస్తు, రాజధాని రైతులకు వసతులపై ఆరా ♦ పవిత్ర మట్టి, జలాల వద్ద ప్రత్యేక పూజల్లో సీఎం సాక్షి, విజయవాడ బ్యూరో: నూతన రాజధాని నగర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో మరచిపోలేని చరిత్రాత్మక ఘట్టమని సీఎం చంద్రబాబు అన్నారు. ఇందుకోసం సాంప్రదాయంగా భారీగా ఏర్పాట్లు చేశామన్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు శంకుస్థాపన జరిగే ఉద్ధండ్రాయునిపాలెం సభా ప్రాంగణం ప్రాంతానికి చేరుకున్న ముఖ్యమంత్రి గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి బయలుదేరి ఉద్దండ్రాయునిపాలెం చేరుకున్న అమరావతి సంకల్పజ్యోతిని అందుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రధాన జ్యోతిని ఆవిష్కరించిన సీఎం కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. శంకుస్థాపన ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయనీ, కనీవినీ ఎరుగని రీతిలో కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అనంతరం ప్రధాన వేదిక, దాని పక్కనే ఉన్న రెండు ఉప వేదికలు, అక్కడే సిద్ధం చేసిన యాగశాల, శంకుస్థాపన శిలాఫలకాన్ని సీఎం పరిశీలించారు. ఇంకా పూర్తి చేయాల్సిన ఏర్పాట్లపై గుంటూరు జిల్లా కలెక్టర్, జేసీలతో చర్చించారు. అనంతరం రాజధాని రైతుల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీని, సాంస్కృతిక కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, హెలిప్యాడ్లు, పార్కింగ్ ప్రదేశాల గురించి ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడారు. పుణ్య జలాలు, మట్టిని కలిపి బుధవారం హెలికాప్టర్ ద్వారా సీఆర్ డీఏ ప్రాంతం అంతా చల్లిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆ ప్రాంతం అంతా శక్తివంతం చేయటానికి, మట్టిని, నీటిని చల్లి పవిత్రం చేయాలని నిర్ణయించినట్లు సీఎం వివరించారు. మంగళవారం రాష్ట్రంలోని 13 జిల్లాలు, దేశంలోని పుణ్యక్షేత్రాల నుంచి వచ్చిన జలాలు, మట్టి ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఎదుట ఉన్న ప్రాంగణంలోకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అక్కడ జరిగిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. రాజధాని నిర్మాణం కోసం మహాసంకల్ప పత్రాలు అందించిన వారందరి జ్ఞాపకాలు చిరస్థాయిగా మిగిలేలా భద్రపరిచి భూమిలో శాశ్వతంగా ఉండేలా చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 13 వేల గ్రామాలు, 3 వేల వార్డులు, 13 జిల్లాల్లోని 175 నియోజకవర్గాల నుంచి, మానససరోవరం, మక్కా మసీదు, జెరూసలెం లాంటి పుణ్య క్షేత్రాలతోపాటు గాంధీ, నెహ్రూ, భగత్సింగ్, అంబేడ్కర్, సుభాష్ చంద్రబోస్ తదితర స్వాతంత్య్ర సంగ్రామ యోధులు జన్మించిన ప్రాంతాల నుంచి పవిత్ర జలాలు, మట్టి ఇక్కడికి చేరుకున్నాయని చెప్పారు. ‘మన నీరు-మన మట్టి’, ’నా ఇటుక- నా అమరావతి’ కార్యక్రమాలను రాష్ట్రంలోని 5 కోట్ల మందిని భాగస్వాముల్ని చేయటానికే నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన మట్టి, జలాలు ఉన్న వాహనాలు, రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల నమూనాలతో ఉన్న వాహనాలు, 13 జిల్లాల నుంచి వచ్చిన ప్రత్యేక వాహనాల ర్యాలీని సీఎం ప్రారంభించారు. అప్రతిష్ట తేవాలని చూస్తున్నారు రాజధాని శంకుస్థాపనను కొన్ని రాజకీయ పార్టీలు అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నాయని చంద్రబాబు విమర్శించారు. మంగళవారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమాల్లో ఏదో ఒక ఇబ్బందిని సృష్టించడానికి కొందరు చూస్తారని అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. రాజధానిని ప్రతి ఒక్కరూ నిండు మనసుతో ఆశీర్వదించాలన్నారు. మంత్రులపై చంద్రబాబు ఆగ్రహం అంతకుముందు శంకుస్థాపన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 19వ తేదీకల్లా ఏర్పాట్లు పూర్తికావాలని ముందు నుంచి చెబుతున్నా ఎందుకు చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు. అన్ని పనులకు కమిటీలు వేసి, నిర్దిష్టంగా బాధ్యతలు అప్పగించినా ఎవరూ వాటి గురించి పట్టించుకోలేదని, అందుకే ఇంకా చాలా పనులు మిగిలిపోయాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్షణం నుంచి ఇచ్చిన పనుల్లోనే ఉండాలని ఎప్పటికప్పుడు తనకు రిపోర్టు చేయాలని ఆదేశించారు. భవిష్యత్లో ఇది విశ్వనగరం: కోడెల దసరా పండగ ఈసారి కొత్త ఉత్సాహాన్ని, సంతోషాన్ని ముందే మోసుకొచ్చిందనీ, భవిష్యత్తులో ఇక్కడి ప్రాంతమంతా విశ్వనగరంగా మారనుందని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. మంగళవారం ఆయన కుటుంబ సమేతంగా ఉద్ధండ్రాయునిపాలెం వచ్చి శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించారు. -
రాజధాని శంకుస్థాపన సభకు 3000 బస్సులు!
ఉద్దండరాయునిపాలెంలో ఈ నెల 22న జరగనున్న రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి మొత్తం మూడు వేల బస్సులు.. మరో మూడు వేల వరకు కార్లు.. ఇవి కాకుండా ప్రత్యేకంగా కాన్వాయ్ కోసం 300 కార్లు, గన్నవరం నుంచి వీఐపీల వినియోగం కోసం 200 ప్రత్యేక వాహనాలు, 10 వోల్వో బస్సులు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అవసరమైతే వాహనాల సంఖ్య పెంచాలని భావిస్తోంది. ప్రైవేట్ వాహనాలకు నామమాత్రపు ధర చెల్లించి వినియోగించాలని నిర్ణయించింది. సభకు దూర ప్రాంతాల నుంచి హాజరయ్యే వారందరికీ రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. దీంతో వాహనాలు సమకూర్చే బాధ్యతను రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంకు అప్పగించారు. దీన్నంతటినీ రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు పర్యవేక్షించనున్నారు. ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన ప్రాంగణంలో పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే కీలక పనులు ముగింపు దశకు చేరాయి. వేదిక ముస్తాబు, ప్రత్యేక అలంకరణ పనులు మరో రెండు రోజుల్లో మొదలుకానున్నాయి. నేడు రవాణా శాఖ ఉన్నతాధికారుల సమావేశం... ఈనెల 22న తుళ్ళూరు మండలం ఉద్దండరాయుని పాలెం గ్రామంలో నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం, బహిరంగ సభ జరగనుంది. దేశ ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభకు హాజరయ్యే వారి కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు జిల్లా నుంచి 1000 బస్సులు మరో 500 కార్లు సమకూర్చాలని ఆదేశాలు అందాయి. అలాగే కృష్ణా జిల్లా నుంచి కూడా వెయ్యి వరకు బస్సులు మరో 300 కార్లు జనసమీకరణ కోసం కేటాయించాలని ఆదేశాలు అందాయి. అలాగే రాష్ట్రంలోని మిగిలిన 11 జిల్లాల నుంచి మరో వెయ్యి బస్సులు, వందల సంఖ్యలో వాహనాలను సమకూర్చనున్నారు. దీనిపై శనివారం రవాణా శాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ రెండు జిల్లాల నుంచే భారీగా జనసమీకరణ చేయనున్నారు. రెండు జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల బస్సులు, వివిధ ప్రైవేట్ స్కూల్ బస్సులను పూర్తి స్థాయిలో తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే మరో 500 వరకు ఆర్టీసీ బస్సులను కూడా రిజర్వ్లో ఉంచేలా చర్యలు తీసుకోనున్నారు. షెడ్లు ఏర్పాటు.. ఇప్పటికే సభా ప్రాంగణంలో షెడ్ల నిర్మాణం పూర్తయింది. దాదాపు 12 లక్షల అడగుల మేర షామియానాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన వేదిక నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. సభకు నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక వెనుక భాగంలో ప్రధాన మంత్రి కోసం రెండు హెలిప్యాడ్లు నిర్మించనున్నారు. సభకు హాజరయ్యే 30 వేల మంది రైతులకు వేదిక ముందు భాగంలో ప్రత్యేక గ్యాలరీ నిర్మిస్తున్నారు. కేటగిరీల వారీగా 18 నుంచి పాస్లు పంపిణీ చేయనున్నారు. 300 మంది వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం శుక్ర వారంతో ముగిసింది. వస్త్రాల అందజేత ... రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు రాష్ట్ర మంత్రులు సంప్రదాయ రీతిలో వస్త్రాలు, స్వీట్ బాక్స్, ఆహ్వానపత్రాలు అందజేసే కార్యక్రమం మండలంలోని నేలపాడు గ్రామంలో ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి. నారాయణ, ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే శ్రావణ్కుమార్లు కలసి వచ్చి కొమ్మినేని ఆదిలక్ష్మి అనే మహిళకు వాటిని అందజేశారు.
Pagination
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
- బెదిరింపుల పర్వం!
- ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
- దుబాయ్లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
- నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...
- ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
Advertisement