రోడ్డుప్రమాదంలో మహిళ మృతి


అనంతపురం క్రైమ్: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ మహిళ మృతిచెందింది. అనంతపురం జిల్లా సోమందేపల్లి జాతీయ రహదారిపై భారత్ పెట్రోలియం బంకు వద్ద గురువారం తెల్లవారుజామున ఒంటి గంటకు ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మృతిచెందిన మహిళ వివరాలు తెలియరాలేదు. పోలీసులు మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top