శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గొడవ
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో టీడీపీ మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డి, ఆలయ ఈవో రామ్రెడ్డిల మధ్య వాగ్వాదం జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాల టెండర్ల వ్యవహారంలో రాధారెడ్డి, రామ్రెడ్డిల మధ్య శుక్రవారం నాడు విభేదాలు తలెత్తాయి.
తనకు సంబంధించిన వ్యక్తులకే టెండర్లు ఇవ్వాలని రాధారెడ్డి పట్టుబట్టగా, ఆలయ ఈవో రాంరెడ్డి దీనిని సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డి ఆలయ ఈవోపై మండిపడ్డారు. లంచాలు తీసుకుంటున్నారని ఈవో రాంరెడ్డిపై ఆరోపణలు చేశారు. ఇద్దరి మధ్య దీంతో గొడవ జరిగింది.