ఈతకెళ్లి పదిహేనేళ్ల బాలుడి మృతి
అనంతపురం: అనంతపురం జిల్లా పుట్లూరు మండలం చింతలపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన గోవింద రెడ్డి(15) అనే బాలుడు ప్రమాదవశాత్తూ మునిగిపోయాడు.
పొలంలోని వ్యవసాయపు నీటితొట్టెలో ఈత కొడుతుండగా మృతిచెందాడు. దాంతో కుటుంబసభ్యుల రోదనలు గ్రామంలో మిన్నంటాయి.