Breaking News

పేదల సంక్షేమమే కాంగ్రెస్‌ ధ్యేయం

Published on Mon, 06/27/2022 - 02:28

సాక్షి, హైదరాబాద్‌: పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే పార్టీ కాంగ్రెస్‌.. అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, పేదలకు ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలను ప్రవేశపె ట్టి ప్రజల మన్ననలు పొందిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వంటి నేతలు కాంగ్రెస్‌కు సేవలందించారని కొనియాడారు.

మాజీ మంత్రి బోడ జనార్దన్, సిర్పూర్‌ బీఎస్‌పీ నాయకుడు రావి శ్రీనివాస్, మెట్‌పల్లి జెడ్పీటీసీ కె.రాధ, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కళ్లెం శంకర్‌రెడ్డి తదితరులు ఆదివారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఏప్రిల్, మే లో ఎన్నికలు ఉంటాయని, జూన్‌లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు.

మాజీ మంత్రి బోడ జనార్దన్‌ మాట్లాడుతూ కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వ్యక్తి రేవంత్‌రెడ్డి ఒక్కరేనని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌.. ఒక్క అవకాశం ఇవ్వండని చెప్పి వందల కోట్లు సంపాదించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు మల్లు రవి, వేంనరేందర్‌ రెడ్డి, మెట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాది నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

Videos

తెనాలి పోలీసుల తీరుపై వైఎస్ జగన్ ఆగ్రహం

ఖాళీ కుర్చీలతో మహానాడు.. తొలిరోజే అట్టర్ ఫ్లాప్

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)