Breaking News

హైదరాబాద్‌కు మరో వందేభారత్‌

Published on Thu, 09/04/2025 - 12:48

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు మరో వందేభారత్‌ రైలు రాబోతోంది. సికింద్రాబాద్‌–పుణే మధ్య ఇది నడవనుంది. ఈ రెండు నగరాల మధ్య రైలు ప్రయాణికుల సంఖ్య భారీగా ఉన్నందున వందేభారత్‌ రైలు నడపాలని గతంలోనే నిర్ణయించారు. కానీ, రేక్‌ అందుబాటులో లేక జాప్యం జరిగింది. తాజాగా హైదరాబాద్‌ నుంచి పుణేకు నడిపేందుకు రేక్‌ కేటాయించినట్టు తెలిసింది. నెల రోజుల్లో దాన్ని పట్టాలెక్కించేందుకు రైల్వే బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌–పుణే మధ్య ప్రయాణికుల సంఖ్య భారీగా ఉంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య 17 రైళ్లు నడుస్తుండటం విశేషం.

8 గంటల్లోనే..
రెండు నగరాల మధ్య 592 కి.మీ. దూరం ఉంది. సాధారణ రైళ్లు గమ్యం చేరేందుకు 11 గంటల నుంచి 13 గంటల సమయం పడుతోంది. శతాబ్ది రైలు 8.30 గంటలు, దురంతో 8.45 గంటల సమయం తీసుకుంటున్నాయి. ఈ నిడివిని వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ 8 గంటల్లో చేరుకోనుంది. దీంతో అత్యంత వేగంగా వెళ్లే రైలుగా వందేభారత్‌ (Vande Bharat) నిలవనుంది. 

వందేభారత్‌ రైలు ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మధ్యాహ్నం పుణేకు చేరుకుంటుంది. అక్కడ మధ్యాహ్నం బయలుదేరి తిరిగి రాత్రి 11 వరకు సికింద్రాబాద్‌ (Secunderabad) చేరుకుంటుంది. ఈ రైలు సర్వీసు ప్రారంభమయ్యాక డిమాండ్‌ను బట్టి దురంతోను కొనసాగించాలా వద్దా నిర్ణయించనున్నారు.  

హైదరాబాద్‌ నుంచి ఆమ్‌స్టర్‌డ్యామ్‌కు నేరుగా విమాన సర్వీసులు 
శంషాబాద్‌: నెదర్లాండ్స్‌ రాజధాని ఆమ్‌స్టర్‌డ్యామ్‌ నగరానికి హైదరాబాద్‌ (Hyderabad) నుంచి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కేఎల్‌ఎం రాయల్‌ డచ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన కేఎల్‌ 874 విమానం బుధవారం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి తన తొలి సర్వీసును టేకాఫ్‌ తీసుకుని అమ్‌స్టర్‌డ్యామ్‌ నగరంలోని షిపోల్‌ విమానాశ్రయానికి బయలుదేరింది. హైదరాబాద్‌ నుంచి సోమ, బుధ, శనివారాల్లో ఈ సర్వీసులు ఉంటాయి. ఆమ్‌స్టర్‌డ్యామ్‌ షిపోల్‌ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు ఆది, మంగళ, శుక్రవారాలు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

చ‌ద‌వండి: మొత్తానికి దొరికారు.. 54 దాడులు, 33 మంది అరెస్ట్‌

ఢిల్లీ, ముంబై, బెంగళూరు (Bengaluru) తర్వాత భారత్‌లోకి నాలుగో గేట్‌గా ఆమ్‌స్టర్‌డ్యామ్‌ నుంచి నేరుగా హైదరాబాద్‌కు తమ సర్వీసులు ప్రారంభించినట్లు ఈ సందర్భంగా కేఎల్‌ఎం సీవోవో స్టీవెన్‌ మార్టెన్‌ తెలిపారు. దీనిద్వారా ఫార్మా, ఐటీ, పర్యాటక రంగాల్లో  పురోగాభివృద్ధికి బాటలు పడతాయని నెదర్లాండ్స్‌ రాయబారి మారిసా గెరార్డ్స్‌ అన్నారు. కొత్త కనెక్టివిటీ యూరప్, ఉత్తర అమెరికా బంధాలను మెరుగుపరుస్తుందని ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్‌ ఫణికర్‌ పేర్కొన్నారు.

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)