Breaking News

మోదీకి వ్యతిరేకంగా నిరసనలు.. 7 వేల మంది సీపీఐ కార్యకర్తల అరెస్టు

Published on Sun, 11/13/2022 - 02:16

సాక్షి, హైదరాబాద్‌/జైపూర్‌ (చెన్నూర్‌): రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు వ్యతిరేకంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన నిర సన కార్యక్రమాల్లో 7 వేల మంది సీపీఐ కార్య కర్తలు, ఏఐటీయూసీ, వివిధ ప్రజా సంఘాల శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. శని వారం తెల్లవారుజాము నుంచే అనేకమందిని గృహనిర్బంధం చేశారు. అలాగే పలువురిని నిరసనల సందర్భంగా పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును రామగుండం వెళ్తుండగా గోదావరిఖనిలో అరెస్టు చేశారు. ఆయనతో పాటు సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, సీపీఐ జాతీయ సమితి సభ్యుడు కలవేన శంకర్, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి తదితరులను మంచిర్యాల జిల్లా జైపూర్‌ స్టేషన్‌కు తరలించారు.

అలాగే సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో జరిగిన నిరసనలో పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సహా పలువురిని అరెస్టు చేసి అబిడ్స్‌ స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మను ఇంటి వద్ద అరెస్టు చేశారు. జవహర్‌నగర్‌లో నిరసన చేపట్టిన సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాలమల్లేశ్, ఈసీ ఐఎల్‌లో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి వి.ఎస్‌.బోస్‌ అరెస్టయ్యారు.
ర్యాలీని అడ్డుకున్న పోలీసులు 
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ శనివారం సీపీఐ చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. మఖ్దూంభవన్‌ నుంచి ర్యాలీగా బయల్దేరిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పోలీ సులు రాష్ట్ర కార్యాలయం లోపలికి వచ్చి కార్యకర్తలు వేసుకుంటున్న నల్ల చొక్కాలను లాక్కోవడం, అరెస్ట్‌ చేయడం దుర్మార్గమని కె.నారాయణ మండిపడ్డారు. 

హక్కులను కాలరాశారు: కూనంనేని 
రాష్ట్రంలో మోదీ పర్యటన రాచరిక పాలనలో రాజు పర్యటనలా సాగిందని, ఆయనను వ్యతిరేకించే వారిని పోలీసులు ముందే నిర్బంధంలోకి తీసుకున్నారని కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో మండిపడ్డారు. ప్రధానిగా మోదీ అధికారం చేపట్టి ఎనిమిదేళ్లు దాటినా ఇప్పటి వరకు ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. కాగా, తమ నాయకుల అరెస్టుకు నిరసనగా సీపీఐ జిల్లా కమిటీ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జైపూర్‌ బస్టాండ్‌ నుంచి పోలీసుస్టేషన్‌కు వరకు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా లేకుండాపోయిందని, ఇది ప్రజాస్వామ్యమా లేక పోలీసు రాజ్యమా అని ప్రశ్నించారు.
చదవండి: నిమ్స్‌ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలి: తమ్మినేని

Videos

అందాల యుద్ధం

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడి ఉపనయన వేడుక

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో కాదు.. సుకుమార్ తోనే ..

అల్లు అర్జున్ లేకుండా ఆర్య 3

చంద్రబాబుకు విజయసాయి రెడ్డి అమ్ముడుపోయాడు

వార్ 2 డైరెక్టర్ పై మండిపడుతున్న Jr. NTR ఫ్యాన్స్.. కారణం అదేనా

స్కాంలకు పరాకాష్ట అమరావతి పేరుతో దోపిడీనే : వైఎస్ జగన్

ఈనాడు టాయిలెట్ పేపర్ కి ఎక్కువ.. టిష్యూ పేపర్ కి తక్కువ..

చంద్రబాబు అప్పుల చిట్టా.. ఆధారాలతో బయటపెట్టిన వైఎస్ జగన్

మన యుద్ధం చంద్రబాబు ఒక్కడితో కాదు..!

Photos

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)