Breaking News

జైస్వాల్‌ రీఎంట్రీ

Published on Mon, 02/02/2026 - 15:23

టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ దేశవాలీ క్రికెట్‌లో ముంబై తరఫున రీఎంట్రీ ఇచ్చాడు. ఫిబ్రవరి 6 నుంచి కర్ణాటకతో జరిగే రంజీ ట్రోఫీ 2025-26 క్వార్టర్‌ ఫైనల్‌ కోసం​ ఎంపిక చేసిన 16 మంది సభ్యుల జట్టులో అతనికి చోటు లభించింది. 

జైస్వాల్ ఈ సీజన్‌లో ఒక్క రంజీ మ్యాచ్ కూడా ఆడలేదు. అంతర్జాతీయ బాధ్యతలు లేకపోయినా జైస్వాల్‌ ముంబై జట్టులో లేకపోవడం కొద్ది రోజుల కిందటి వరకు చర్చనీయాంశంగా ఉండింది. ఎట్టకేలకు అతనికి ముంబై జట్టులో చోటు దక్కడంతో ఊహాగానాలకు తెరపడింది. 

తాజాగా ప్రకటించిన జట్టులో జైస్వాల్‌తో పాటు శార్దూల్‌ ఠాకూర్‌కు కూడా చోటు దక్కింది. శార్దూల్ గాయాల కారణంగా గత కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. శార్దూల్‌ ముంబై జట్టుకు రెగ్యులర్‌ కెప్టెన్‌గానూ ఉన్నాడు. రహానే వైదొలగడంతో శార్దూల్‌కు కెప్టెన్సీ లభించింది. జైస్వాల్‌, శార్దూల్‌ చేరికతో ముంబై జట్టు పటిష్టంగా కనిపిస్తుంది.  

కర్ణాటకతో జరిగే క్వార్టర్‌ ఫైనల్‌ కోసం ముంబై జట్టు..  
- శార్దూల్ ఠాకూర్ (కెప్టెన్) 
- యశస్వి జైస్వాల్
- ముషీర్ ఖాన్  
- అఖిల్ హెర్వడ్కర్  
- సిద్ధేశ్ లాడ్  
- సర్ఫరాజ్ ఖాన్  
- ఆకాష్ ఆనంద్ (wk)  
- హార్దిక్ తమోరే (wk)  
- సైరాజ్ పటిల్  
- శంస్ ములానీ  
- తనుష్ కోటియన్  
- తుషార్ దేశ్‌పాండే  
- మోహిత్ అవస్థ  
- ఓంకార్ తర్మలే  
- దివ్యేష్ సక్సేనా  
- సూర్యాంశ్ షెడ్గే  

 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)