Breaking News

గెలుస్తే నిలుస్తారు.. న్యూజిలాండ్‌తో చావోరేవో తేల్చుకోనున్న ఇంగ్లండ్‌

Published on Tue, 11/01/2022 - 12:48

టీ20 వరల్డ్‌కప్‌-2022 గ్రూప్‌-1లో ఇవాళ (నవంబర్‌ 1) అత్యంత కీలకమైన మ్యాచ్‌ జరుగనుంది. బ్రిస్బేన్‌ వేదికగా ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ గ్రూప్‌ నుంచి న్యూజిలాండ్‌ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 5 పాయింట్లు, 3.850 రన్‌రేట్‌) సెమీస్‌ రేసులో ముందుండగా.. రెండో బెర్త్‌ కోసం ఆస్ట్రేలియా (4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ ఓటమితో 5 పాయింట్లు, -0.304 రన్‌రేట్‌), ఇంగ్లండ్‌ (3 మ్యాచ్‌ల్లో ఓ గెలుపు మరో ఓటమితో 3 పాయింట్లు, 0.239 రన్‌రేట్‌) జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

ఈ క్రమంలో ఇంగ్లండ్‌ సెమీస్‌ రేసులో నిలవాలంటే న్యూజిలాండ్‌తో ఇవాళ జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 1:30  గంటలకు ప్రారంభమయ్యే ఈ సమరంలో ఇంగ్లండ్‌ చావోరేవో తేల్చుకోనుంది.  

ఇంగ్లండ్‌ ఈ మ్యాచ్‌ గెలవడంతో పాటు తదుపరి శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో గెలిస్తేనే సెమీస్‌ అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఇంగ్లండ్‌ 7 పాయింట్లతో నేరుగా సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఆస్ట్రేలియా గనుక తమ ఆఖరి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై భారీ తేడాతో గెలిచి, న్యూజిలాండ్‌ తమ ఆఖరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై భారీ తేడాతో గెలిస్తే.. గ్రూప్‌-1 నుంచి న్యూజిలాండ్‌ తొలి సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకోనుండగా, రెండో బెర్త్‌ కోసం ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య పోటీ ఉంటుంది.

ఈ సమీకరణల ప్రకారం మూడు జట్లు 7 పాయింట్లతో సమంగా ఉంటే, రన్‌రేట్‌ కీలకం కానుంది. మెరుగైన రన్‌రేట్‌ కలిగిన జట్టు ఈ గ్రూప్‌ నుంచి రెండో సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంటుంది. న్యూజిలాండ్‌కు ఇ‍ప్పటికే మెరుగైన రన్‌రేట్‌ ఉంది కాబట్టి.. ఇంగ్లండ్‌ చేతిలో ఓడినా ఆఖరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై ఓ మోస్తరు విజయం సాధిస్తే దర్జాగా సెమీస్‌కు వెళ్తుంది. కాగా, ఈ గ్రూప్‌లో ఉన్న ఐర్లాండ్‌, ఆఫ్ఘనిస్తాన్‌, శ్రీలంక జట్లు దాదాపుగా సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించినట్టే.  

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)