Breaking News

అలా అయితే.. ఇప్పట్లో IPL పూర్తి చేయడం కష్టమే!

Published on Sat, 05/15/2021 - 11:40

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా కారణంగా గతేడాది ప్రత్యక్షంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ చూసే అవకాశం లేకపోయినా టీవీలోనైనా వీక్షించి ఆనందించారు క్రికెట్‌ ప్రేమికులు. భారత్‌లో పరిస్థితుల దృష్ట్యా వేదికను యూఈఏకి మార్చిన బీసీసీఐ.. ఐపీఎల్‌-2020ను విజయవంతంగా పూర్తి చేసి వారికి వినోదాన్ని అందించింది. అయితే, 14వ సీజన్‌కు వచ్చే సరికి సీన్‌ మారింది. ఈసారి స్వదేశంలోనే క్యాష్‌ రిచ్‌లీగ్‌ నిర్వహించారు. కానీ, బయో బబుల్‌లో ఉన్నా ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో ఐపీఎల్‌-2021కు మధ్యలోనే బ్రేక్‌ పడింది. 31 మ్యాచ్‌లు మిగిలి ఉండగానే టోర్నీని నిరవధికంగా వాయిదా వేశారు. అయితే, విదేశాల్లో మిగతా షెడ్యూల్‌ పూర్తి చేద్దామనుకున్నప్పటికీ పరిస్థితులు అంత అనుకూలంగా ఏమీ కనిపించడం లేదు.

ముఖ్యంగా సన్‌రైజర్స్‌ ఆటగాడు వృద్ధిమాన్‌ సాహాకు మరోసారి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడం, కేకేఆర్‌ క్రికెటర్‌ ప్రసిద్‌ కృష్ణ ఇంకా హోంక్వారంటైన్‌లోనే ఉండాల్సి రావడం సహా విదేశీ ఆటగాళ్లు ఇప్పటికే స్వస్థలాలకు తరలివెళ్లడం వంటి అంశాలు అభిమానుల్లో సందేహాలు రేకెత్తిస్తున్నాయి. మరోసారి అందరినీ ఒకేచోటకు చేర్చడం, బయె బబుల్‌ నిబంధనలు పక్కాగా అమలు అయ్యేలా చూడటం అంత తేలికేం కాదని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. టోర్నీ ప్రారంభానికి ముందే ఐపీఎల్‌లో పాల్గొనే ఆటగాళ్లు, సిబ్బందికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయిద్దామని ఫ్రాంఛైజీలు భావించినా, పలువురు క్రికెటర్లు ఇందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. 

వ్యాక్సిన్‌ వేయించుకుంటే బాగుండేదేమో!
‘‘చాలా మంది ఆటగాళ్లు వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ఇష్టపడలేదు. నిజానికి అది వారి తప్పు కాదు. టీకాపై అవగాహన లేకపోడం మాత్రమే. ఇంకొంత మంది మాత్రం.. బయో బబుల్‌లో సురక్షితంగా ఉన్నాం కదా. వ్యాక్సిన్‌తో పనేంటి అనుకున్నారు. దీంతో, ఫ్రాంఛైజీలు కూడా వారిని మరీ ఇబ్బంది పెట్టదలచుకోలేదు. ఫలితంగా పరిస్థితులు ఒక్కసారిగా తారుమారైపోయాయి. చార్టర్‌ ఫ్లైట్లలో ప్రయాణాలు చేసినప్పటికీ ఇతర సిబ్బంది కూడా మాతోనే ఉంటారు కదా. వారి కోవిడ్‌ స్టేటస్‌ ఏంటో కూడా మాకు తెలియదు. అలాంటప్పుడు ఎవరికి ఎప్పుడు వైరస్‌ సోకిందో చెప్పడం కష్టం’’ అని విశ్వసనీయ వర్గాలు చెప్పినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. అయితే, విదేశీ క్రికెటర్లు, సిబ్బంది టీకా వేయించుకునేందుకు ఆసక్తి చూపినా, చట్టపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున వారికి వ్యాక్సినేషన్‌ చేయలేకపోయామని తెలిపినట్లు వెల్లడించింది. 

కాగా సాహా, ప్రసిద్‌ కృష్ణ మే 25న ముంబైలో నిర్వహించే మూడు కరోనా నిర్దారణ పరీక్షల్లో నెగటివ్‌ వస్తే మాత్రమే వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం ఇంగ్లండ్‌కు వెళ్లేందుకు వారికి చా​న్స్‌ ఉంటుంది. లేదంటే మేజర్‌ టోర్నీపై ఆశలు వదులుకోవాల్సి వస్తుంది. ఇక ఐపీఎల్‌ వాయిదా పడిన తర్వాత పలువురు టీమిండియా ఆటగాళ్లు టీకా వేయించుకుంటున్న సంగతి తెలిసిందే. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, శిఖర్‌ ధావన్‌, పుజారా, రిషభ్‌ పంత్‌, ఇషాంత్‌ శర్మ తదితరులు వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నారు.

చదవండి: Hanuma Vihari: విహారి వలంటీర్స్‌...

Videos

Watch Live: వైఎస్ జగన్ కీలక ప్రెస్ మీట్

వాషింగ్టన్ డీసీలో కాల్పుల కలకలం

దీన్నే నమ్ముకొని ఉన్నాం.. మా పొట్టలు కొట్టొద్దు.. ఎండీయూ ఆపరేటర్ల ధర్నా

నా పర్మీషన్ తీసుకోవాల్సిందే!

ఢిల్లీ-శ్రీనగర్ విమానానికి తప్పిన ప్రమాదం

ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు బండారం బయటపడుతుందనే ఉరవకొండకి రాలేదు

జనసేనపై పిఠాపురం టీడీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు..

ఏందిరయ్యా ఏంజేతున్నావ్

హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం

పాక్ లో నన్ను పెళ్లి చేసుకో.. టెర్రరిస్టులతో జ్యోతి లవ్ స్టోరీ

Photos

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)