Breaking News

WTC Final: ‘ఒక్క గంట ఆట, ఇమేజ్‌ మొత్తం డ్యామేజ్‌’

Published on Sun, 06/27/2021 - 16:18

ముంబై: తుది సమరంలో గెలిస్తేనే అది అసలైన విజయమని, మిగతా ఎన్ని మ్యాచ్‌లు గెలిచినా ఏం ఉపయోగం లేదని ప్రముఖ వ్యాఖ్యాత, భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్షిప్‌ ఫైనల్లో టీమిండియా ఓటమిపై విశ్లేషిస్తూ ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్‌ మ్యాచ్‌ రిజర్వ్‌డే నాడు ఒక్క సెషన్‌ టీమిండియా కొంపముంచిందని ఆయన పేర్కొన్నాడు. ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ హోదా కోసం కోహ్లీ సేన రెండేళ్లుగా పడిన కష్టం, సాధించిన విజయాలు ఆ ఒక్క సెషన్‌తో కనుమరుగయ్యాయని వెల్లడించాడు. గెలిచిన ట్రోఫీల ఆధారంగానే జట్లు, కెప్టెన్ల పేరు ప్రఖ్యాతులు చరిత్రలో నిలబడుతాయని, అంతిమ యుద్ధం గెలవకపోతే ఎంత మందిని ఓడించినా లాభం లేదని వ్యాఖ్యానించాడు. రిజర్వ్‌డే రోజు ఎలాగైనా ఫలితం సాధించాలనే అత్యుత్సాహంతో టీమిండియా ఓటమిపాలైందని అభిప్రాయపడ్డాడు. 

ఆఖరి రోజు తొలి సెషన్‌లో జాగ్రత్తగా ఆడాలని నిపుణులు హెచ్చరించినప్పటికీ.. కోహ్లీ, పుజారాలు అలక్ష్యంగా వికెట్‌ పారేసుకోవడంతో టీమిండియా మ్యాచ్‌పై పట్టుకోల్పోయిందని, గత ఐదేళ్లుగా టెస్ట్‌ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ వస్తున్న టీమిండియా కేవలం ఒక్క గంట ఆటతో ఆ ఇమేజ్‌ మొత్తాన్ని నాశనం చేసుకుందని పేర్కొన్నాడు. కాగా, రిజర్వ్‌డే రోజు కోహ్లీ, పుజారా ఔటయ్యాక భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 32 పరుగుల ఆధిక్యాన్ని మినహాయిస్తే న్యూజిలాండ్‌ లక్ష్యం 138 పరుగులకు చేరింది. కివీస్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ (52), టేలర్‌ (47) అద్భుతంగా పోరాడి తమ జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో న్యూజిలాండ్‌ 8 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించి ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌గా ఆవిర్భవించింది. 
చదవండి: Michael Vaughan: ‘అలా అయితే భారత్‌ను ఓడించడం కష్టమే’

Videos

ఏంటీ త్రివిక్రమ్ - వెంకటేష్ సినిమాకు అలాంటి టైటిలా?

తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి సుప్రీంకోర్టు సీరియస్

సింహాచలం ఘటనలో మృతుల కుటుంబానికి YSRCP తరుపున ఆర్థిక సహాయం అందజేత

సమస్య చెప్పు కోవడానికి వచ్చిన రైతు పట్ల మైలవరం MLA వసంత కృష్ణప్రసాద్ ఆగ్రహం

మురళీ నాయక్ మరణం తీరని లోటు YSRCP వెంకటరామి రెడ్డి కామెంట్స్

సుప్రీంకోర్టు తీర్పుపై పలు ప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి

KSR Live Show: పథకాలకు నో మనీ.. జల్సాలకు ఫుల్ మనీ..!

హైదరాబాద్ సహా పలు చోట్ల మోస్తారు వర్షం

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో రష్మిక.. భారీ రెమ్యునరేషన్ డిమాండ్...

అనంతపురం జిల్లాను వణికిస్తున్న వర్షాలు

Photos

+5

అనంతపురంలో కుండపోత వర్షం.. వరద నీటిలో ప్రజల ఇక్కట్లు (ఫొటోలు)

+5

#MissWorld2025 : బతుకమ్మలతో ముద్దుగుమ్మలకు ఆత్మీయ స్వాగతం (ఫొటోలు)

+5

ఈ తీపి గుర్తులు మరిచిపోలేను‌.. ఫోటోలు విడుదల చేసిన శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

జాతరలో నిర్లక్ష్యం గంగమ్మ జాతరకు భారీగా భక్తులు..(ఫొటోలు)

+5

వరంగల్‌ : కాకతీయ వైభవాన్ని చూసి మురిసిన విదేశీ వనితలు (ఫొటోలు)

+5

Miss World2025: రామప్ప ఆలయంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు

+5

Cannes Film Festival 2025: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన అందాల తారలు.. ఫోటోలు

+5

గంగమ్మ జాతరలో కీలక ఘట్టం..విశ్వరూప దర్శనంలో గంగమ్మ (ఫొటోలు)

+5

హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

అంగరంగ వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)