గౌతం గంభీర్ కీల‌క నిర్ణ‌యం!?

Published on Sun, 10/27/2024 - 11:03

పుణే వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన రెండో టెస్టులో 113 ప‌రుగుల తేడాతో టీమిండియా ఓట‌మి చ‌విచూసిన సంగ‌తి తెలిసిందే. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మ‌రో మ్యాచ్ మిగిలూండ‌గానే 2-0 టీమిండియా కోల్పోయింది. దీంతో సొంత‌గ‌డ్డ‌పై 12 ఏళ్ల భార‌త టెస్టు సిరీస్ విజ‌యాల ప‌రంపంర‌కు బ్రేక్ ప‌డింది. అంతేకాకుండా ఈ ఓట‌మితో భార‌త్‌ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ అవకాశాలు కూడా సన్నగిల్లాయి. 

ఇక తొలి రెండు టెస్టుల్లో ఓట‌మి చవిచూసిన టీమిండియా.. ఇప్పుడు సిరీస్‌లో ఆఖ‌రి టెస్టు మ్యాచ్‌కు సిద్ద‌మైంది. నవంబర్ 1 నుంచి ముంబై వేదిక‌గా ఇరు జ‌ట్ల మ‌ధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి వైట్ వాష్ నుంచి త‌ప్పించుకోవాల‌ని టీమిండియా భావిస్తోంది. మరోవైపు డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసులో నిలబడాలంటే ఈ మ్యాచ్‌ భారత్‌కు చాలా కీలకం. ఈ నేప‌థ్యంలో భార‌త జ‌ట్టు మేనేజ్‌మెంట్ కీల‌క నిర్ణ‌యం తీసుకోవాల్సింది.

నో ఛాయిస్‌..!
న్యూజిలాండ్‌తో ఆఖ‌రి టెస్టుకు ముందు ప్ర‌తీ ఒక్క‌రూ ట్రైనింగ్ సెష‌న్‌లో కచ్చితంగా  పాల్గోవాలని టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ తమ ఆటగాళ్లకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఏ ఒక్కరూ మినహాయింపు కాదని గంభీర్ స్పష్టం చేశాడంట. 

కాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ ప్రకారం.. భారత జట్టు పుణే నుంచి ఆదివారం(ఆక్టోబర్ 27) ముంబైకి చేరుకోనుంది. ఆటగాళ్లకు  టీమ్ మేనేజ్‌మెంట్ రెండు రోజుల విశ్రాంతిని కేటాయించినట్లు సమాచారం. ఆ తర్వాత ఈ నెల 30, 31 తేదీల్లో రెండు రోజులపాటు జరిగే ప్రాక్టీస్ సెషన్‌లో టీమిండియా పాల్గోనుంది. 

ఈ రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రాక్టీస్‌ క్యాంపులో భారత ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించనున్నారు. స్పిన్నర్లను ఎదుర్కొవడంతో తడబడుతున్న భారత జట్టు.. ఈ సన్నాహాక క్యాంపులో ఆ ఆంశంపై దృష్టిసారించే అవకాశముంది.
చదవండి: చ‌రిత్ర సృష్టించిన జైశ్వాల్‌.. 92 ఏళ్ల భారత క్రికెట్‌ హిస్ట‌రీలోనే

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

‘కూర్మావతార్‌’ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)