Breaking News

వ్యాక్సిన్‌ రెండు డోసులు వేసుకుని ఏం ప్రయోజనం.. వైరస్‌ మళ్లీ సోకింది

Published on Fri, 07/16/2021 - 15:08

లండన్‌: టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌.. ఇటీవలే కరోనా బారిన పడి, ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అయితే అతనికి కరోనా ఎలా వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కరోనా సోకకముందు పంత్‌ ఎక్కడ తిరిగాడు, ఎవరెవరిని కలిశాడు అని బీసీసీఐ వర్గాలు ఆరా తీస్తుండగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి. జూన్‌ 29న పంత్‌.. వెంబ్లీ స్టేడియంలో యూరో ఛాంపియన్‌షిప్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూసేందుకు వెళ్లాడు. అక్కడ మాస్క్‌ లేకుండానే అభిమానులతో సెల్ఫీలు దిగాడు. కాగా, పంత్‌ ఇక్కడే కరోనా బారినపడ్డాడని అందరూ భావించారు. 

కానీ, అతనికి చాలా గ్యాప్‌ తరువాత అంటే జులై 8న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అంటే పంత్‌కు ఫుట్‌బాల్‌ స్టేడియంలో కరోనా సోకలేదన్న విషయం స్పష్టమైంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ మధ్యలో అతను జులై 5, 6 తేదీల్లో ఓ దంత వైద్యుడి సంప్రదించాడు. జులై 7న రెండో డోస్‌ వ్యాక్సిన్‌ కూడా వేయించుకున్నాడు. ఆ మరుసటి రోజే అంటే జులై 8న అతనికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అంటే అతనికి దంత వైద్యశాలలోనే వైరస్‌ సోకి ఉండవచ్చని బీసీసీఐ ప్రాధమిక నిర్ధారణకు వచ్చింది. వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నాక కూడా పంత్‌.. వైరస్‌ బారిన పడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా, పంత్‌కు కరోనా డెల్టా వేరియంట్‌ వైరస్‌ సోకిందని వైద్య పరీక్షల్లో రుజువైనట్లు సమాచారం. 

Videos

బలూచ్ గడ్డపై జెండా పాతిన తొలి హిందూ యువతి

హైదరాబాద్ మెట్రోరైల్ రెండో దశ రెండో భాగం నిర్మించేందుకు కసరత్తు

Miss World Contestants: రామప్ప, వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట సందర్శన

వైఎస్ జగన్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

బయటపడుతున్న తుర్కియే కుట్రలు

నర్సీపట్నంలో బాక్సైట్ తవ్వకాల పేరుతో 2 వేల కోట్ల స్కామ్: పెట్ల ఉమా

భారత జవాన్ ను విడిచిపెట్టిన పాకిస్థాన్

రేవంత్ స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారు: NVSS ప్రభాకర్

దేశంలో తాజా భద్రత పరిస్థితులపై సమీక్షించిన సీసీఎస్

చైనా మీడియా సంస్థ ఎక్స్ అకౌంట్ నిలిపివేత

Photos

+5

గంగమ్మ జాతరలో కీలక ఘట్టం..విశ్వరూప దర్శనంలో గంగమ్మ (ఫొటోలు)

+5

హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

అంగరంగ వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

దారి వెంట నీరాజనం..‘జై జగన్‌’ అంటూ నినాదాలు (ఫొటోలు)

+5

#MissWorld2025: బ్యూటీ విత్‌ ఫన్‌..‘బుట్ట బొమ్మా’ పాటకు స్టెప్పులు (ఫొటోలు)

+5

చౌమహల్లా ప్యాలెస్‌లో యువరాణుల్లా మెరిసిన సుందరీమణులు (ఫొటోలు)

+5

చార్మినార్ దగ్గర మిస్‌ వరల్డ్‌ అందాలభామల ఫోటోషూట్ (ఫొటోలు)

+5

భావితరాలు మీరు ఆదర్శం: భారత సైన్యానికి మోదీ సెల్యూట్ (ఫొటోలు)

+5

హీరో గోపీచంద్ వెడ్డింగ్ యానివర్సరీ (ఫొటోలు)

+5

నిర్మాత ఇషారీ గణేశ్ కూతురి రిసెప్షన్.. హాజరైన స్టార్స్ (ఫొటోలు)