Breaking News

T20 WC 2022: వార్మప్‌ మ్యాచ్‌ల్లో టీమిండియా ఆడేది ఎవరితో అంటే..

Published on Thu, 09/08/2022 - 19:42

ప్రతిష్టాత్మక ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్‌క‌ప్ 2022 టోర్నీ ఆస్ట్రేలియా వేదికగా అక్టోబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న సంగతి తెలిసిందే. టోర్నీ ప్రారంభానికి ముందు అన్ని జట్లకు ప్రాక్టీస్‌ కోసం వార్మప్‌ మ్యాచ్‌లు నిర్వహించడం ఆనవాయితీ. కాగా వార్మప్‌ మ్యాచ్‌ల‌కు చెందిన షెడ్యూల్‌ను ఐసీసీ గురువారం రిలీజ్ చేసింది. ఇందులో మొత్తం 16 జట్లు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇక టీమిండియా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లతో వార్మప్‌ మ్యాచ్‌లు ఆడనుంది.

అక్టోబ‌ర్ 17వ తేదీన ఆస్ట్రేలియాతో, 19వ తేదీన కివీస్‌తో భారత్‌ తలపడనుంది. వార్మప్‌ మ్యాచ్‌ల‌ను అధికారిక మ్యాచ్‌లుగా గుర్తించ‌రన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టి20 వ‌ర‌ల్డ్‌క‌ప్ అక్టోబ‌ర్ 16వ తేదీన ప్రారంభం అవుతోంది. తొలి మ్యాచ్ శ్రీలంక‌, న‌మీబియా మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. ఇక గ్రూఫ్‌-2లో ఉన్న టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అక్టోబర్‌ 24న ఆడనుంది. ఆ తర్వాత వరుసగా బంగ్లాదేశ్‌, సౌతాఫ్రికాలతో పాటు మరో రెండు జట్లను ఎదుర్కోనుంది.
 

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)