రోహిత్‌ భయ్యా.. మాకు రెండు టికెట్స్‌ ఇప్పించవా

Published on Sat, 10/09/2021 - 19:04

India Vs Pak T20WC Clash.. టీమిండియా, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ అంటేనే ఫ్యాన్స్‌లో ఎక్కడలేని ఉత్సాహం కనిపిస్తుంది. ఇరుజట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుందంటే ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయిన సందర్భాలు ఎక్కువే.. అలాంటిది మ్యాచ్‌ను ప్రేక్షకుల మధ్య చూస్తే ఆ మజా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా యూఏఈ వేదికగా టి20 ప్రపంచకప్‌ 2021లో టీమిండియా, పాకిస్తాన్‌ల మధ్య అక్టోబర్‌ 24న మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి.

చదవండి: IPL 2021: టీ20 వరల్డ్‌కప్‌ బాగా ఆడు.. కానీ గెలవకూడదు.. ఓకేనా!

ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ 2021లో శుక్రవారం ముంబై ఇండియన్స్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ల మధ్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు హాజరైన ఒక అభిమాని టీమిండియా-పాకిస్తాన్‌ మ్యాచ్‌కు రెండు టికెట్లు కావాలంటూ రోహిత్‌ శర్మను విజ్ఞప్తి చేయడం ఆసక్తికరంగా మారింది. '' రోహిత్‌ భయ్యా.. ఇండియా, పాకిస్తాన్‌ మ్యాచ్‌కు మాకు రెండు టికెట్లు ఇప్పించవు.. ప్లీజ్‌'' అంటూ ప్లకార్డు చేతపట్టుకొని ఒక అభిమాని అడిగాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. 

ఇక ఐసీసీ టి20 ప్రపంచకప్‌ టోర్నీల్లో పాకిస్తాన్‌ ఇంతవరకు ఒక్కసారి కూడా టీమిండియాను ఓడించలేకపోయింది. ఇరు జట్లు ఐదుసార్లు తలపడగా.. టీమిండియానే విజయం వరించింది. అందులో టి20 ప్రపంచకప్‌ 2007 ఫైనల్‌ కూడా ఉండడం విశేషం. మరోవైపు ఈ ప్రపంచకప్‌లో టీమిండియాను పాక్‌ ఓడిస్తే ఆ జట్టు సభ్యులకు బ్లాంక్‌ చెక్‌ ఇస్తానంటూ పీసీబీ చైర్మన్‌ రమీజ్‌ రజా సంచలన వ్యాఖ్యలు చేశాడు.

చదవండి: శిఖా పాండే అద్భుతం.. వుమెన్స్‌ క్రికెట్‌ చరిత్రలో 'బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ'

Videos

నేడు మూడు చోట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రచార సభలు

జగనే మళ్లీ సీఎం.. అరుకులో ప్రస్తుత పరిస్థితి...అభివృద్ధి

ఏపీలో కూటమి మేనిఫెస్టో తో తమకు సంబంధం లేదన్న బీజేపీ

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)