Breaking News

ఇంగ్లండ్‌ గడ్డపై టి20 సిరీస్‌ గెలవాలన్న కోరిక కలగానే..

Published on Fri, 09/16/2022 - 09:32

ఇంగ్లండ్‌ గడ్డపై టి20 సిరీస్‌ గెలవాలనే కోరిక టీమిండియా మహిళల జట్టుకు కలగానే మిగిలిపోయింది. గురువారం రాత్రి జరిగిన మూడో టి20లో ఇంగ్లండ్‌ మహిళల జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా ఉమెన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్ల దాటికి భారత్‌ టాప్‌-5 బ్యాటర్స్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు.

ఒక దశలో 35 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ కనీసం వంద పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. ఈ దశలో దీప్తి శఱ్‌మ(25 బంతుల్లో 24 పరుగులు), రిచా ఘోష్‌(22 బంతుల్లో 33 పరుగులు), పూజా వస్త్రాకర్‌ 19 పరుగులు నాటౌట్‌ చేయడంతో టీమిండియా గౌరవ ప్రదమైన స్కోరు అందుకుంది. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఎక్లీస్టోన్‌ 3, సారా గ్లెన్‌ 2, వాంగ్‌, డేవిస్‌, స్మిత్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.

123 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ జట్టు 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఓపెనర్లు సోఫియా డంక్లీ 49 పరుగులు, డేనియల్‌ వ్యాట్‌ 22 పరుగులతో శుభారంభం అందించారు. అనంతరం అలీస్‌ క్యాప్సీ(24 బంతుల్లో 38 నాటౌట్‌), బ్రయాన్‌ స్మిత్‌ 13 పరుగులు నాటౌట్‌ జట్టును గెలిపించారు. కాగా ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ సెప్టెంబర్‌ 18న(ఆదివారం) జరగనుంది.

చదవండి: జడేజాలా తిప్పాలని యువ క్రికెటర్‌ విశ్వ ప్రయత్నాలు

Videos

జగన్ ఫోటో తొలగింపు.. టీడీపీ నేతలపై గోరంట్ల మాధవ్ ఫైర్

25 వేల మంది ఆధారపడి ఉన్నారు వాళ్ల కుటుంబాల పరిస్థితి ఏంటి

హార్వర్డ్ యూనివర్సిటీపై మరోసారి ట్రంప్ సర్కారు కొరడా

టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గు పడుతున్న.. బండారు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

మై డియర్ డాడీ.. కేసీఆర్ కు కవిత సంచలన లేఖ

Big Question: బాబుకు బాదుడే బాదుడు.. అతిపెద్ద కుంభకోణం

ఎల్లోమీడియాను ఉతికి ఆరేసిన వైఎస్ జగన్

తిరుమలలో మరో అపచారం

ఈడీపై సుప్రీం ఆగ్రహం

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై టీడీపీ సీరియస్ నేతల ఫైర్

Photos

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)