Breaking News

పీసీబీకి థాంక్స్‌.. ఇండియా- పాక్‌ మ్యాచ్‌ అంటే: పాకిస్తాన్‌ పర్యటనలో బీసీసీఐ బాస్‌

Published on Tue, 09/05/2023 - 17:44

BCCI President Roger Binny Visit To Pakistan: పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ ధన్యవాదాలు తెలిపారు. తమను పాకిస్తాన్‌కు ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. కాగా ఆసియా కప్‌-2023 నిర్వహణ హక్కులను పాకిస్తాన్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే.

అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేది లేదని బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్‌ మండలి(ఏసీసీ) అధ్యక్షుడు జై షా స్పష్టం చేశారు. ఈ క్రమంలో చర్చోపర్చల అనంతరం శ్రీలంకతో కలిసి హైబ్రిడ్‌ విధానంలో ఈ వన్డే ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు పీసీబీ సిద్ధపడింది.

ఆ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే
ఇందుకు తగ్గట్లుగానే భారత జట్టు ఆడే మ్యాచ్‌లన్నింటితో పాటు ఫైనల్‌ కూడా శ్రీలంకలోనే జరుగనుంది. ఇదిలా ఉంటే.. ఏసీసీ సభ్యులు, ఆసియా కప్‌లో భాగమైన జట్ల క్రికెట్‌ బోర్డు మెంబర్స్‌ను పీసీబీ డిన్నర్‌కు ఆహ్వానించింది.


PC: PCB

ఈ క్రమంలో బీసీసీఐ బాస్‌ రోజర్‌ బిన్నీతో పాటు.. ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా సోమవారం నాటి పీసీబీ విందుకు హాజరయ్యారు. లాహోర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రోజర్‌ బిన్నీ మాట్లాడుతూ.. దాయాదుల పోరు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

థాంక్యూ పీసీబీ
‘‘మమ్మల్ని ఇక్కడకు ఆహ్వానించిన పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుకు బీసీసీఐ తరఫున కృతజ్ఞతలు చెబుతున్నా. బీసీసీతో పాటు భారత్‌లో ఉన్న క్రికెట్‌ ప్రేమికుల తరఫున కూడా నేనే విష్‌ చేస్తున్నా. ఇండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌ అంటేనే అందరికీ పండుగ.

రోడ్లు మొత్తం ఖాళీ అవుతాయి
మ్యాచ్‌ మొదలైందంటే చాలు.. ప్రతి ఒక్కరు అలెర్ట్‌ అయిపోతారు. పనులన్నీ పక్కనపెట్టేస్తారు. రోడ్లు మొత్తం ఖాళీ అయిపోతాయి. ప్రతి ఒక్కరు క్రికెట్‌ చూసేందుకు టీవీ ముందు కూర్చుంటారు’’ అంటూ రోజర్‌ బిన్నీ చిరకాల ప్రత్యర్థుల క్రికెట్‌ పోరు గురించి కామెంట్‌ చేశారు.

పల్లెకెలెలో మ్యాచ్‌ అద్భుతంగా సాగిందని.. వర్షం అంతరాయం కలిగించి ఉండకపోతే.. ఫలితం చూసే వాళ్లమని పేర్కొన్నారు. పీసీబీ ఆహ్వానం మేరకు సరిహద్దులు దాటి వచ్చామన్న బిన్నీ.. ఇదొక అద్భుతమైన అనుభవమని సంతోషం వ్యక్తం చేశారు. కాగా ఆసియా కప్‌-2023లో భారత్‌- పాక్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే.

అది స్వర్ణయుగం
ఇక రాజీవ్‌ శుక్లా మాట్లాడుతూ..  2004 తర్వాత మళ్లీ పాకిస్తాన్‌కు రావడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. అప్పట్లో ఇండియా- పాకిస్తాన్‌కు స్వర్ణయుగమని గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. కాగా పాకిస్తాన్‌ వేదికగా ఆగష్టు 30న ఆరంభమైన ఆసియా టోర్నీ సెప్టెంబరు 17న శ్రీలంకలో జరుగనున్న ఫైనల్‌తో ముగియనుంది.

చదవండి: WC 2023: ఇద్దరూ తుదిజట్టులో ఉంటే తప్పేంటి?: బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌


 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు