Breaking News

నేను వైఎస్సార్‌ వదిలిన బాణాన్ని: షర్మిల 

Published on Mon, 09/26/2022 - 01:39

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తాను బీజేపీ, టీఆర్‌ఎస్‌ వదిలిన బాణాన్ని కాదని, తెలంగాణలో సంక్షేమ పాలన కోసం వైఎస్సార్‌ వదిలిన బాణాన్ని అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వ్యాఖ్యానించారు. తెలంగాణలో షర్మిల పార్టీ ఎందుకు పెట్టినట్టు అని కాంగ్రెస్‌ నేతలు అనడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ నేతలు వారి పార్టీ కథలు వారు చూసుకోవాలని హితవు పలికారు.

ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆదివారం సంగారెడ్డిలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో జరిగిన బహిరంగసభలో షర్మిల మాట్లాడారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి కాదని, ఎనిమిదేళ్లుగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న మోసగాడని విరుచుకుపడ్డారు. రుణమాఫీ, వడ్డీలేని రుణాలు, నిరుద్యోగ భృతి వంటి హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల్లో దక్షిణ భారతదేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు.

బంజారాహిల్స్‌ బాలికపై అత్యాచారం చేసిన ఎమ్మెల్యేల కొడుకులు, మంత్రి మనవళ్లపై చర్యలు లేవని మండిపడ్డారు. బీడి బిచ్చం.. కల్లు ఉద్దెర అన్న చందంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తయారైందని ఎద్దేవా చేశారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపైనా షర్మిల ఘాటైన విమర్శలు చేశారు. నోటుకు ఓటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్‌రెడ్డి అని ధ్వజమెత్తారు. ఈ కేసులో చిప్పకూడు తిన్న రేవంత్‌రెడ్డి పిలక కేసీఆర్‌ చేతిలో ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రాజకీయ స్వార్థం కోసం తప్ప ప్రజల కోసం పనిచేయడం లేదని షర్మిల విమర్శించారు. 

Videos

Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా

Nizamabad : అంగవైకల్యం అడ్డస్తున్నా.. సంకల్ప బలం ఉంటే చాలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు

ఉల్లి పంటకు గిట్టుబాటు ధర దొరక్క తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు

Anakapalli: రోడ్లు వేయాలంటూ పంచకర్ల రమేష్‌ను పట్టుబట్టిన స్థానికులు

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Photos

+5

2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)